Mallu Ravi: వార్ రూమ్ కేసు విచారణ.. సంక్రాంతి తర్వాత వస్తానన్న మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Ravi Gives Clarity Why He Not Attend Cyber Crime Enquiry In Congress War Room Case: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి.. నేడు విచారణకు హాజరు కాలేదు. పార్టీపరమైన సమావేశాల కారణంగానే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని స్పష్టం చేశారు. మల్లు రవి మట్లాడుతూ.. ఈరోజు విచారణకు రావాలని తనకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే.. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు తనకు మీటింగ్ ఉందని, అందుకే తాను విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం తెలియజేశానని తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత ఏదైనా తేడీ ఫిక్స్ చేస్తే, అప్పుడు తప్పకుండా హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని అన్నారు. తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని, దీనిపై తనకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. తాము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేవలం విమర్శించడానికే తప్ప.. అవమానించడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
Delhi Liquor Scam: స్పెషల్ కోర్టులో అభిషేక్ వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
కాగా.. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని.. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో సునీల్ కనుగోలుతో పాటు ఆయన కింద పని చేస్తున్న మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా.. సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ధ్రువీకరించారు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేస్తూ, ఈనెల 12న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!