Mallu Ravi: వార్ రూమ్ కేసు విచారణ.. సంక్రాంతి తర్వాత వస్తానన్న మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Ravi Gives Clarity Why He Not Attend Cyber Crime Enquiry In Congress War Room Case: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి.. నేడు విచారణకు హాజరు కాలేదు. పార్టీపరమైన సమావేశాల కారణంగానే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని స్పష్టం చేశారు. మల్లు రవి మట్లాడుతూ.. ఈరోజు విచారణకు రావాలని తనకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే.. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు తనకు మీటింగ్ ఉందని, అందుకే తాను విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం తెలియజేశానని తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత ఏదైనా తేడీ ఫిక్స్ చేస్తే, అప్పుడు తప్పకుండా హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని అన్నారు. తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని, దీనిపై తనకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. తాము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేవలం విమర్శించడానికే తప్ప.. అవమానించడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
Delhi Liquor Scam: స్పెషల్ కోర్టులో అభిషేక్ వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
కాగా.. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని.. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో సునీల్ కనుగోలుతో పాటు ఆయన కింద పని చేస్తున్న మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా.. సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ధ్రువీకరించారు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేస్తూ, ఈనెల 12న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!