Mallu Ravi: వార్ రూమ్ కేసు విచారణ.. సంక్రాంతి తర్వాత వస్తానన్న మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Ravi Gives Clarity Why He Not Attend Cyber Crime Enquiry In Congress War Room Case: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి.. నేడు విచారణకు హాజరు కాలేదు. పార్టీపరమైన సమావేశాల కారణంగానే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని స్పష్టం చేశారు. మల్లు రవి మట్లాడుతూ.. ఈరోజు విచారణకు రావాలని తనకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే.. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు తనకు మీటింగ్ ఉందని, అందుకే తాను విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం తెలియజేశానని తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత ఏదైనా తేడీ ఫిక్స్ చేస్తే, అప్పుడు తప్పకుండా హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని అన్నారు. తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని, దీనిపై తనకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. తాము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేవలం విమర్శించడానికే తప్ప.. అవమానించడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
Delhi Liquor Scam: స్పెషల్ కోర్టులో అభిషేక్ వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
కాగా.. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని.. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో సునీల్ కనుగోలుతో పాటు ఆయన కింద పని చేస్తున్న మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా.. సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ధ్రువీకరించారు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేస్తూ, ఈనెల 12న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..
తాజావార్తలు
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!