Gun Firing In Nagole: పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్.. టార్గెట్ వారిద్దరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Firing In Nagole: నాగోల్ లో నిన్న జరిగిన బంగారు షాప్ లో దోపిడి హైదరాబాద్ ను షేక్ చేస్తుంది. బంగారు షాప్ చొరబడి కాల్పులు జరిపి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన తీరు అచ్చం సినిమాను తలపించేలా చేసింది. ఈ ఘటనలో బంగారు షాక్ యజమానితో పాటు అక్కడున్న వారిపై కాల్పులు జరడంతో.. తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బంగారు యజమానితో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. మహదేవ్ జ్యువల్లర్స్ కాల్పుల కేసులో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో రాచకొండ సీ పీ మహేష్ భగవత్ పరామర్శించారు. 15 టీమ్స్ తో నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. రాచకొండ పరిధిలో గతం లోనూ ఇలాంటి దోపిడీ జరిగిందని గుర్తుచేసుకున్నారు. యూపీ , బీహార్ కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ గణపతి జ్యువలరీ నుండి ప్రతి గురువారం బంగారాన్ని తెచ్చి అన్ని షాప్ లకు సరఫరా చేస్తారని అన్నారు.
Read also: Bigg Boss 6: సింగర్ రేవంత్ ఇంట్లో సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అన్విత
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఇది లాస్ట్ షాప్ అని, అక్కడ ఫైర్ చేసి దోపిడీ చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. సుఖ్ దేవ్ తో పాటు రాజ్ కుమార్ సుహానను దుండగులు టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు. కాల్పుల సమయంలో సుఖ్ రామ్, రాజ్ కుమార్ లు గోల్డ్ సప్లై చేశారు. పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్ వేశారు. గోల్డ్ సప్లేయర్లను ముందే దుండగులు గుర్తించారు. నిన్న సికింద్రాబాద్ నుంచి రెండున్నర కేజీల గోల్డ్ తో సుఖ్ దేవ్, రాజ్ కుమార్ సుహాన బయటకి వచ్చారు. నాచారం మెడిపల్లి, వనస్థలిపురంలో సుఖ్ రాం,రాజ్ కుమార్ లు కొంత గోల్డ్ సప్లై చేశారు. మూడు ఏరియాల్లో అర కిలో గోల్డ్ సప్లై చేసిన ఇద్దరు లాస్ట్కు నాగోల్ లోని మహాదేవ్ షాప్ లో సప్లై చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. 2కిలోల గోల్డ్ లక్ష డెబ్భై నగదు తో దుండగులు ఎస్కేప్ అయ్యారు. ఎవరికి దొరక్కుండా ముందుగానే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా చూసుకున్నారు. మెహానికి ముసుగు, హెల్మెట్ ధరించి దోపిడీకి పాల్పడ్డారు. నలువురు నిందితుల కోసం 15 టీం లు రంగంలోకి దింపిన రాచకొండ పోలీసులు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్పై పీఎస్లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!