Madhapur Water Contamination: పెరుగుతున్న బాధితులు.. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
https://ntvtelugu.com/nvss-prabhakar-slams-trs-govt-on-drugs/
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వడ్డెర కాలనీకి చెందిన బాధితులలో ఒక మహిళ పరిస్థితి విషమంగా వుంది. బాధితులలో 11 మంది చిన్నారులు వున్నారు. వారంతా చలి, విపరీత జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. రాత్రి నుంచి గంట గంటకి బాధితులు గంటగంటకి పెరగడంతో వైద్యులు సీరియస్ గా ఉన్న వారిని ప్రైవేట్ హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్ళమని చెబుతున్నారు.
15 రోజులు నుంచి నీరు రంగు మారి వాసన వస్తుందని చెబుతున్నారు బాధితులు. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. కలుషిత నీరు వస్తుందని చాలా రోజులుగా చెబుతున్నాం అన్నారు బాధితుడు భీమయ్య కుటుంబసభ్యులు. నీళ్ళు వదిలే లైన్ మెన్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు.
వాటర్ ఫిల్టర్ కొనుక్కోని తాగాలంటున్నారు అధికారులు. ఇవాళేమో ఆ వాటర్ తో స్నానం కూడా చేయవద్దని చెబుతున్నారు. ఇన్ని రోజులు స్నానం చేయవద్దని చెబుతున్నారు. భీమయ్య తో పాటు అతని ఇద్దరి పిల్లలకు నిన్న సీరియస్గా ఉందని, వారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాం. ఈలోగా భీమయ్య కు వాంతులు ఎక్కువగా అయ్యాయని, ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామన్నారు. ఇదిలా వుంటే.. మాదగ్గరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఎక్కువ మంది వస్తున్నారని, ఇవాళ 43 మంది బస్తీ వాసులకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.
సీవియర్ గా ఉన్న వారినే ఆస్పత్రికి తరలిస్తున్నాం అన్నారు. ఫుడ్ లేదా వాటర్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. అందరూ ఒకే లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. రికవరీ ఆయిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నారు. పిల్లలు తట్టుకోలేక పోతున్నారు, వారి కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ గా ఉన్న వారికి ఐ సీ యూ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు గుట్టల బేగంపేట్ బస్తీలో కలుషిత నీరు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపం ద్వారానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. వాటర్ వర్క్స్ ఎండి పై కేసు నమోదు చేయాలంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!