Madhapur Water Contamination: పెరుగుతున్న బాధితులు.. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
https://ntvtelugu.com/nvss-prabhakar-slams-trs-govt-on-drugs/
Also Read
కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వడ్డెర కాలనీకి చెందిన బాధితులలో ఒక మహిళ పరిస్థితి విషమంగా వుంది. బాధితులలో 11 మంది చిన్నారులు వున్నారు. వారంతా చలి, విపరీత జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. రాత్రి నుంచి గంట గంటకి బాధితులు గంటగంటకి పెరగడంతో వైద్యులు సీరియస్ గా ఉన్న వారిని ప్రైవేట్ హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్ళమని చెబుతున్నారు.
15 రోజులు నుంచి నీరు రంగు మారి వాసన వస్తుందని చెబుతున్నారు బాధితులు. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. కలుషిత నీరు వస్తుందని చాలా రోజులుగా చెబుతున్నాం అన్నారు బాధితుడు భీమయ్య కుటుంబసభ్యులు. నీళ్ళు వదిలే లైన్ మెన్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు.
వాటర్ ఫిల్టర్ కొనుక్కోని తాగాలంటున్నారు అధికారులు. ఇవాళేమో ఆ వాటర్ తో స్నానం కూడా చేయవద్దని చెబుతున్నారు. ఇన్ని రోజులు స్నానం చేయవద్దని చెబుతున్నారు. భీమయ్య తో పాటు అతని ఇద్దరి పిల్లలకు నిన్న సీరియస్గా ఉందని, వారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాం. ఈలోగా భీమయ్య కు వాంతులు ఎక్కువగా అయ్యాయని, ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామన్నారు. ఇదిలా వుంటే.. మాదగ్గరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఎక్కువ మంది వస్తున్నారని, ఇవాళ 43 మంది బస్తీ వాసులకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.
సీవియర్ గా ఉన్న వారినే ఆస్పత్రికి తరలిస్తున్నాం అన్నారు. ఫుడ్ లేదా వాటర్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. అందరూ ఒకే లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. రికవరీ ఆయిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నారు. పిల్లలు తట్టుకోలేక పోతున్నారు, వారి కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ గా ఉన్న వారికి ఐ సీ యూ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు గుట్టల బేగంపేట్ బస్తీలో కలుషిత నీరు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపం ద్వారానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. వాటర్ వర్క్స్ ఎండి పై కేసు నమోదు చేయాలంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!