Madhapur Water Contamination: పెరుగుతున్న బాధితులు.. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
https://ntvtelugu.com/nvss-prabhakar-slams-trs-govt-on-drugs/
Also Read
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వడ్డెర కాలనీకి చెందిన బాధితులలో ఒక మహిళ పరిస్థితి విషమంగా వుంది. బాధితులలో 11 మంది చిన్నారులు వున్నారు. వారంతా చలి, విపరీత జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. రాత్రి నుంచి గంట గంటకి బాధితులు గంటగంటకి పెరగడంతో వైద్యులు సీరియస్ గా ఉన్న వారిని ప్రైవేట్ హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్ళమని చెబుతున్నారు.
15 రోజులు నుంచి నీరు రంగు మారి వాసన వస్తుందని చెబుతున్నారు బాధితులు. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. కలుషిత నీరు వస్తుందని చాలా రోజులుగా చెబుతున్నాం అన్నారు బాధితుడు భీమయ్య కుటుంబసభ్యులు. నీళ్ళు వదిలే లైన్ మెన్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు.
వాటర్ ఫిల్టర్ కొనుక్కోని తాగాలంటున్నారు అధికారులు. ఇవాళేమో ఆ వాటర్ తో స్నానం కూడా చేయవద్దని చెబుతున్నారు. ఇన్ని రోజులు స్నానం చేయవద్దని చెబుతున్నారు. భీమయ్య తో పాటు అతని ఇద్దరి పిల్లలకు నిన్న సీరియస్గా ఉందని, వారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాం. ఈలోగా భీమయ్య కు వాంతులు ఎక్కువగా అయ్యాయని, ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామన్నారు. ఇదిలా వుంటే.. మాదగ్గరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఎక్కువ మంది వస్తున్నారని, ఇవాళ 43 మంది బస్తీ వాసులకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.
సీవియర్ గా ఉన్న వారినే ఆస్పత్రికి తరలిస్తున్నాం అన్నారు. ఫుడ్ లేదా వాటర్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. అందరూ ఒకే లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. రికవరీ ఆయిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నారు. పిల్లలు తట్టుకోలేక పోతున్నారు, వారి కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ గా ఉన్న వారికి ఐ సీ యూ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు గుట్టల బేగంపేట్ బస్తీలో కలుషిత నీరు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపం ద్వారానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. వాటర్ వర్క్స్ ఎండి పై కేసు నమోదు చేయాలంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!