NTV Telugu Site icon

Liquor Supply: మందుబాబులకు మంచి వార్త.. నేటి అర్ధరాత్రి వరకు బార్లు ఓపెన్..

Frinking New Year

Frinking New Year

Liquor Supply: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు పిలుపునిచ్చారు. నేటి అర్ధరాత్రి వరకు పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్‌లకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని ఏసీఎస్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్‌లు అర్ధరాత్రి 1 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. జిల్లాలో 102 వైన్ షాపులు, 17 బార్లు ఉన్నాయని తెలిపారు. వైన్‌షాప్‌లు సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు, బార్‌లు రాత్రి 11 గంటలకు మూసివేయబడతాయి.

ఇక (డిసెంబర్ 31వ) సందర్భంగా వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. సంబరాలే కాదు దానికి తగ్గట్టు ఆంక్షలు కూడా విధించారు అధికారులు. ఇవాళ (31న) నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అనేక ఆంక్షలు, మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్‌లలో మైనర్‌లను అనుమతించవద్దని, అలాగే దంపతులు, పెద్దల కోసం నిర్వహించే న్యూ ఇయర్ పార్టీలను అనుమతించవద్దని కమిషనర్‌లు నిర్వాహకులను ఆదేశించారు. రివాల్వర్లు వంటి మారణాయుధాలతో ఈవెంట్‌లలోకి ప్రవేశించరాదని, అశ్లీల నృత్యాలు, అసభ్యకర దృశ్యాలు, వ్యభిచారాన్ని ప్రోత్సహించడం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అనుమతించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభా ప్రాంగణంలో 45 డెసిబుల్స్‌కు మించరాదని, సామర్థ్యానికి మించి రద్దీని అనుమతించరాదని, ఇష్టానుసారంగా పాస్‌లు, టిక్కెట్లు విక్రయించరాదని హెచ్చరించారు.

Read also: Mann Ki Baat : ఫిట్ ఇండియా, మానసిక ఆరోగ్యం… మన్ కీ బాత్ లో మోడీ ఏం చెప్పారంటే

సీసీ కెమెరాలతో నిఘా తప్పనిసరి..
కార్యక్రమాలు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. ఈవెంట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు పార్కింగ్‌ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వేడుక ముగిసిన తర్వాత వాటి ఫుటేజీని పోలీసులకు సమర్పించాలని చెప్పారు. మద్యం సేవించిన వ్యక్తులు వాహనాలు నడపకూడదని, వారికి డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులదేనన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేయనున్నారు.

రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లు మూసివేయబడతాయి
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం. 45 ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్-జేఎన్‌టీయూ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ ఫ్లైఓవర్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు పూర్తిగా మూతపడతాయి. అధికారులు తెలిపారు. . నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించరు.

క్యాబ్‌ డ్రైవర్లు రైడ్‌ను తిరస్కరిస్తే జరిమానా..
నేడు, రేపు  (31, జనవరి 1వ) తేదీల్లో క్యాబ్ డ్రైవర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రైడ్‌ను తిరస్కరించరాదని, రైడ్‌ని తిరస్కరించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే 9490617346కు ఫిర్యాదు చేయవచ్చు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
* నెక్లెస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి.
* ఖైరతాబాద్ వీవీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద మళ్లించి నిరంకారి, రాజ్ భవన్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
* బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ వద్ద మళ్లించి ఇక్బాల్‌ మినార్‌, లఖ్డీకపూల్‌, అయోధ్య జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు.
* లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, తెలుగు తాలి, ఇక్బాల్ మినార్ మరియు రవీంద్రభారతి మీదుగా అనుమతించబడతాయి.
Sajjanar: టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. ఇకపై ఫ్యామిలీ టికెట్ల నిలిపివేత..