సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. అదే మందు.. మటనో.. చికెన్ ఉండాల్సిందే.. ఇదే ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ మద్యం అమ్మకాలు జరిగేలా చేసింది.. 2021-22 ఏడాదిలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి.. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం డిపోల నుండి రూ.30,711 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఈరోజు ఒక్క రోజే రూ.235 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.. మొత్తంగా ఇవాళ్టితో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో.. ఈ ఏడాది మొత్తం ఎంత మేర మద్యం అమ్మకాలు జరిగాయనే గణాంకాలను వెల్లడించారు.. గత ఏడాది రికార్డులను ఈ ఏడాది తుడిపేసింది.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మద్యం అమ్మకాలు రూ. 27,289 కోట్లుగా ఉండగా.. ఆ రికార్డులను బద్దలు కొడుతూ.. రూ.30,711 కోట్లతో నయా రికార్డు రాసింది 2021-22 ఆర్థిక సంవత్సరం.
Read Also: TS: కొత్త రికార్డు సృష్టించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం..