Site icon NTV Telugu

MLA Kunamneni : కేటీఆర్ ఫోన్ చేసి సీపీఐకు బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు

Kunamneni

Kunamneni

Kunamneni Sambasiva Rao : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి మద్దతు ప్రకటించడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది.

కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో, ఆ పార్టీకి తాము బేషరతుగా మద్దతు ఇస్తామని కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెలిపారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. “మీరు గెలిచారు కాబట్టి మీకు మద్దతు ఇస్తామని కేటీఆర్ గారు చెప్పారు” అని కూనంనేని ధృవీకరించారు. ఈ పరిణామంతో కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో సీపీఐకి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.

అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!

మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేసే ప్రసక్తే లేదని కూనంనేని స్పష్టం చేశారు. తమకు దక్కిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఎవరైనా మద్దతు ఇస్తామంటే కాదనబోమని ఆయన పేర్కొన్నారు. మూర్ఖత్వంగా ఎవరి మద్దతును వదులుకోలేమని, మేయర్ పీఠాన్ని దక్కించుకుని ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.

బీఆర్ఎస్‌తో పాటు పలువురు ఇండిపెండెంట్లు (స్వతంత్ర అభ్యర్థులు) కూడా తమకు సహకరిస్తామని ముందుకు వచ్చారని కూనంనేని తెలిపారు. అయితే, ఎవరి మద్దతు తీసుకోవాలి? పొత్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై మరో రెండు రోజుల్లో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్‌మెయిల్..

Exit mobile version