Kunamneni Sambasiva Rao: బండి సంజయ్కి సవాల్.. దమ్ముంటే మోడీతో ప్రమాణం చేయించు
Kunamneni Sambasiva Rao Fires On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు. చట్టాల మీద, వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి బండి సంజయ్ అని.. ఆయన అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికినప్పటికీ.. బుకాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తనకు సంబంధం లేని విషయంపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అని ప్రశ్నించారు. ఢిల్లీ డీల్కు నువ్వెందుకు ప్రమాణాలు చేస్తున్నావు? అని నిలదీశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రధాని మోడీతో ప్రమాణం చేయించు అని బండి సంజయ్కి సవాల్ విసిరారు.
మీకు భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదని.. కేవలం మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని సాంబశివ రావు వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని.. బీజేపీని గద్దె దించేందుకే తాము లౌకిక శక్తులతో పోరాటం చేసేందుకు టీఆర్ఎస్తో కలిశామని వివరణ ఇచ్చారు. తమ పొత్తు మీద ప్రశ్నిస్తున్న మీరు.. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? వారికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం.. మీము పొత్తు పెట్టుకుంటే తప్పా? అని అడిగారు. సీబీఐ ఒక గవర్నర్ వ్యవస్థలా తయారైందని, చాలా రాష్ట్రాలు సీబీఐని బహిష్కరించాయని అన్నారు. అందులో భాగంగానే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ అనుమతి లేదని జీవో తీసుకొచ్చిందన్నారు.
Also Read
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
- Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
వచ్చే ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల బరిలో ఉంటామని ప్రమాణం చేయగలరా? అని సాంబశివ రావు ప్రశ్నించారు. మీరు ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి అయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చా? అని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అక్కడ ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ తప్పు చేయరని, సిద్ధాంతాల ప్రకారమే తమ పోరాటాలు ఉంటాయని అన్నారు. ప్రజల కోసమే కమ్యూనిస్టులు నిరంతరం పని చేస్తారన్నారు.
బండి సంజయ్ ఒక రాజకీయ అజ్ఞాని, ఒక మూర్ఖుడని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడి మీడియాలో హైలెట్ కావాలని అనుకుంటున్నాడని సాంబశివ రావు ధ్వజమెత్తారు. ఏ విషయంపై కూడా ఆయనకు సరైన అవగాహన లేదని, రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ఆయన్ను ఎలా నియమించిందో తెలియదని ఎద్దేవా చేశారు. తడి బట్టలతో ప్రమాణం చేస్తే అన్ని మాఫీ అయిపోయేట్టు ఉంటే ఇక కోర్టులు ఎందుకు? అని అన్నారు. వామపక్షాలపై బండి అవాకులు చెవాకులు పేలుతున్నారని, మా సిద్ధాంతాల ప్రకారం మేము నడుచుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సాంబశివ రావు నిలదీశారు.
తాజావార్తలు
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
-
Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
-
Cancer Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అది క్యాన్సర్ కావచ్చు.. చెక్ చేసుకోండి!
-
Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!