Site icon NTV Telugu

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్‌

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు. కనీసం ఈసారైన కేంద్ర బడ్జెట్‌లో అయినా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ ఇండ్రస్టీయల్‌ రాయితీలు అందించాలన్నారు.

Read Also: హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్

తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదని కేటీఆర్‌ అన్నారు. ప్రధానమంత్రి మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు….రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే ఎలా సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. కేంద్ర సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. మా హక్కులు డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. పెట్టుబడులు పెంట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్‌ మేక్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.


Exit mobile version