NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుంది..

Komati Reddy Rajagopal Reddy

Komati Reddy Rajagopal Reddy

Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా
తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటుతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్నారు. కేసీఆర్ అక్రమాలను నిజాయితీగా బయటపెట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Dharmapuri Arvind: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదు..

కేసిఆర్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడా ఇండియా కుటుంబం లో ఉన్నాడా? అని ప్రశ్నించారు. కేసిఆర్ మాటలు వింటుంటే… ఆయన ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి బాగాలేదేమో అనిపిస్తుందన్నారు. ఆర్ఆర్ టాక్స్ అంటూ మోడీ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. AA (ఆదాని, అంబానీ) టాక్స్ వసూలు చేస్తూ దేశ సంపదనను చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే సమావేశాల్లో జీవో నెంబర్ 46 ను రద్దు చేస్తామన్నారు. నల్లగొండ, భువనగిరి 2 లోక్ సభ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

Read also: Peddireddy vs Nallari: మరోసారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దిరెడ్డి హాట్‌ కామెంట్లు..

నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. గల్లీ నుండి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు అని, సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను చేసుకొస్తా.. భారీ మెజార్టీ మీరు ఇవ్వండన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేటీఆర్, కేసీఆర్‌ మానసిక పరిస్థితి దిగజారి పోయిందని, బీఆర్‌ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది… రాహుల్ ప్రధాని అవుతున్నారని, ఆగష్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమేనన్నారు.
Amit Shah: రాయ్‌బ‌రేలిలో రాహుల్‌ గాంధీ ఓటమి ఖాయం..