Komatireddy Rajagopal Reddy: మునుగోడు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy Comments On CM KCR In BJP Munugodu Meeting: మునుగోడు సమరభేరి సభ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ తర్వాత సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభం అవుతుందని, మునుగోడులో ధర్మం గెలుస్తుందని అన్నారు. మోసకారి, దగా కోరు, నయవంచక కుటుంబం చేతిలో చిక్కి.. తెలంగాణ రాష్ట్రం విలవిల్లాడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్దం జరుగుతోందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కేసీఆర్ అపాయింట్మెంట్ను ఎన్నిసార్లు కోరినా ఇవ్వలేదన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని.. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల మధ్య జరిగే యుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారేటప్పుడు చాలామంది నేతలు నైతిక విలువల్ని వదిలేస్తున్నారని, కానీ తాను మాత్రం పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని అన్నారు. తాను అమిత్ షాను కలిసినప్పటి నుంచి కేసీఆర్కు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే.. మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన అవినీతిమయంగా మారింది.. కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ప్రజల మీద విశ్వాసంతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం అప్పుల పాలైందని, మన పిల్లల భవిష్యత్ కోసం మోదీ, అమిత్ షా నాయకత్వంలో పని చేద్దామని అన్నారు. ఉద్యమకారులందరూ మరోసారి ఉద్యమానికి సిద్ధంకండని పిలుపునిచ్చారు. బీజేపీ సభను దెబ్బతీసేందుకే కేసీఆర్ నిన్న సభ పెట్టారని.. కానీ అభ్యర్థి పేరు చెప్పకుండా సభ ముగించారని అన్నారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం లేదని ఆరోపించారు. కేసీఆర్ను గద్దె దింపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..