Jupally V/S harshavardhan: కొల్లాపూర్ లో హైటెన్షన్.. మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొల్లాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజకీయ హీట్ ఉత్కంఠ రేపుతుంది. కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నేతలిద్దరూ అధికార గులాబీ పార్టీకే చెందినవారే అయితే వీరిద్దరూ ఓపెన్ ఛాలెంజ్ చేసుకోవడం చర్చకు దారి తీస్తోంది.
బహిరంగ చర్చకు సిద్దమంటూ ఒకరిపై మరొకరు ఛాలెంజ్ విసురుకోవడంతో.. ఆదివారం కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరనం నెలకొంది. నిన్న (శనివారం) రాత్రికి రాత్రే ఇద్దరు నేతలు కొల్లూపూర్ చేరుకోవడంతో వాతావరణం హీట్ ఎక్కింది. అయితే ఈక్రమంలో అలర్ట్ అయిన పోలీసులు చర్చలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ నిబంధనలు ఉల్లఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఇదిలా వుంటే జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేడు ఉదయం కొల్లాపూర్లో జూపల్లి ఇంటి వద్దకు నలుగురు అనుచరులు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఇంటి వద్ద కూడా పోలీసులు బారీకేడ్డు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలు బయటకు రాకుండా ఇంటికే పరిమితం చేసినట్లు సమాచారం.
కాగా.. కొంత కాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. టీఆర్ ఎస్ కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు పని చేసిన ఆయన 2018 ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత బీరం టీఆర్ఎస్ కండువాకప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి జూపల్లి, బీరం మధ్య విభేదాలు కొనసాగుతు వస్తున్నాయి. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూవస్తున్నారు.
నేతలు ఒకరినొకరు అభివృద్ధి విషయంలో నువ్వా నేనా అనట్టు సవాళ్లు విసురుకున్నారు. ఈమధ్య కాలంలో ఇది మరింతగా ముదిరి చర్చకు దారితీసింది. వీరిద్దరి నేతల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి చేరింది. టీఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏం నిర్వహించినా కొల్లాపూర్ నియోజకవర్గంలో గొడవలకే దారితీస్తోంది. అభివృద్ధిపై తనతో చర్చకు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలనిజూపల్లి సవాల్ చేయగా.. బీరం కూడా సై అనడంతో వాతావరణం హీట్ ఎక్కింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు చర్యలో భాగంగా ఎటువంటి అవాంఛిత గొడవకు తావులేకుండా.. నేతలిద్దరిని ఇంటికే పరిమితం చేసి 144 సెక్షన్ విధించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!