Hyderabad Crime: సికింద్రాబాద్ లో దారుణం.. పక్కకు జరగమంటే ప్రాణాలే తీశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: సికింద్రాబాద్ రసల్పురాలో దారుణం చోటుచేసుకుంది. పాన్ షాప్ వద్ద నలుగురు యువకులు నిలబడ్డారు. అయితే అప్పుడే మరో వ్యక్తి పాన్ షాప్ కు రావడం కాస్త పక్కకు జరగండి అనడంతో యువకుల మధ్య జరిగిన గొడవ కాస్త బస్తీలో నడి రోడ్డుపై ఓ యువకుడి ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది.
రసూల్ పూర్వ అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న తరుణ్.. పదవ తరగతి వరకు చదివాడు.. అతను ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే స్థానికంగా ఉంటున్న యువకులతో చిన్నపాటి గొడవ జరగగా.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. నడిరోడ్డుపై అతనిపై దాడి చేయడంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వినకుండా తీవ్రంగా కొట్టడంతో పాటు కత్తితో దాడి చేయగా.. తరుణ్ అక్కడే కుప్పకూలడు. విషయం గమనించిన స్థానికులు తరుణ్ ను ఆసుపత్రికి తరలించగా ఆప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
Read also: Sudheer: టీవీ అయిపోయింది.. ఇక ఓటీటీ మీద పడ్డ ‘సుధీర్’..!
తరుణ్ ను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. వెంటనే బేగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతుండగా.. అక్కడ జరిగిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదు కావడంతో.. దాడి చేసిన నలుగురు వరంగల్ కు చెందిన యువకులుగా గుర్తించారు పోలీసులు. పాన్ షాప్ వద్ద పక్కకు జరగాలని తరుణ్ కోరడంతో.. ఒకరిపై ఒకరి దాడికి వెళ్లిందని, చివరికి ప్రాణాలు తీసే వరకు పరిస్థితి మారిందని స్థానికులు తెలిపారు.
Read also: Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్ల సమస్యలపై ఆరా!
మరోవైపు మియాపూర్ లో అల్లుడు మామను చంపిన ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. అల్లుడు రవికుమార్ కూతురు అనితల మధ్య తరచు గొడవలు జరిగేవి. గొడవల కారణంగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుండి అనిత వెళ్లిపోయింది. నా కూతురు లేకుండా నువ్వు నా ఇంట్లో ఎలా ఉంటావని అల్లుడితో మామ కిష్టయ్య గొడవ పడ్డాడు. గొడవ పెద్దగా అవ్వడంతో పక్కనే ఉన్న పారతో కిష్టయ్య తలపై బలంగా కొట్టిన అల్లుడు వెంకటేష్. తలపై బలంగా కొట్టడంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. నిందితుడు రవికుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ బ్యారక్ పక్కన ఎవరెవరు గ్యాంగ్ స్టర్లు ఉన్నారంటే ?
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!