Hyderabad Crime: సికింద్రాబాద్ లో దారుణం.. పక్కకు జరగమంటే ప్రాణాలే తీశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: సికింద్రాబాద్ రసల్పురాలో దారుణం చోటుచేసుకుంది. పాన్ షాప్ వద్ద నలుగురు యువకులు నిలబడ్డారు. అయితే అప్పుడే మరో వ్యక్తి పాన్ షాప్ కు రావడం కాస్త పక్కకు జరగండి అనడంతో యువకుల మధ్య జరిగిన గొడవ కాస్త బస్తీలో నడి రోడ్డుపై ఓ యువకుడి ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది.
రసూల్ పూర్వ అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న తరుణ్.. పదవ తరగతి వరకు చదివాడు.. అతను ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే స్థానికంగా ఉంటున్న యువకులతో చిన్నపాటి గొడవ జరగగా.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. నడిరోడ్డుపై అతనిపై దాడి చేయడంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వినకుండా తీవ్రంగా కొట్టడంతో పాటు కత్తితో దాడి చేయగా.. తరుణ్ అక్కడే కుప్పకూలడు. విషయం గమనించిన స్థానికులు తరుణ్ ను ఆసుపత్రికి తరలించగా ఆప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
Read also: Sudheer: టీవీ అయిపోయింది.. ఇక ఓటీటీ మీద పడ్డ ‘సుధీర్’..!
తరుణ్ ను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. వెంటనే బేగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతుండగా.. అక్కడ జరిగిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదు కావడంతో.. దాడి చేసిన నలుగురు వరంగల్ కు చెందిన యువకులుగా గుర్తించారు పోలీసులు. పాన్ షాప్ వద్ద పక్కకు జరగాలని తరుణ్ కోరడంతో.. ఒకరిపై ఒకరి దాడికి వెళ్లిందని, చివరికి ప్రాణాలు తీసే వరకు పరిస్థితి మారిందని స్థానికులు తెలిపారు.
Read also: Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్ల సమస్యలపై ఆరా!
మరోవైపు మియాపూర్ లో అల్లుడు మామను చంపిన ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. అల్లుడు రవికుమార్ కూతురు అనితల మధ్య తరచు గొడవలు జరిగేవి. గొడవల కారణంగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుండి అనిత వెళ్లిపోయింది. నా కూతురు లేకుండా నువ్వు నా ఇంట్లో ఎలా ఉంటావని అల్లుడితో మామ కిష్టయ్య గొడవ పడ్డాడు. గొడవ పెద్దగా అవ్వడంతో పక్కనే ఉన్న పారతో కిష్టయ్య తలపై బలంగా కొట్టిన అల్లుడు వెంకటేష్. తలపై బలంగా కొట్టడంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. నిందితుడు రవికుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ బ్యారక్ పక్కన ఎవరెవరు గ్యాంగ్ స్టర్లు ఉన్నారంటే ?
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!