Hyderabad Crime: సికింద్రాబాద్ లో దారుణం.. పక్కకు జరగమంటే ప్రాణాలే తీశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: సికింద్రాబాద్ రసల్పురాలో దారుణం చోటుచేసుకుంది. పాన్ షాప్ వద్ద నలుగురు యువకులు నిలబడ్డారు. అయితే అప్పుడే మరో వ్యక్తి పాన్ షాప్ కు రావడం కాస్త పక్కకు జరగండి అనడంతో యువకుల మధ్య జరిగిన గొడవ కాస్త బస్తీలో నడి రోడ్డుపై ఓ యువకుడి ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది.
రసూల్ పూర్వ అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న తరుణ్.. పదవ తరగతి వరకు చదివాడు.. అతను ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే స్థానికంగా ఉంటున్న యువకులతో చిన్నపాటి గొడవ జరగగా.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. నడిరోడ్డుపై అతనిపై దాడి చేయడంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వినకుండా తీవ్రంగా కొట్టడంతో పాటు కత్తితో దాడి చేయగా.. తరుణ్ అక్కడే కుప్పకూలడు. విషయం గమనించిన స్థానికులు తరుణ్ ను ఆసుపత్రికి తరలించగా ఆప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Read also: Sudheer: టీవీ అయిపోయింది.. ఇక ఓటీటీ మీద పడ్డ ‘సుధీర్’..!
తరుణ్ ను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. వెంటనే బేగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతుండగా.. అక్కడ జరిగిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదు కావడంతో.. దాడి చేసిన నలుగురు వరంగల్ కు చెందిన యువకులుగా గుర్తించారు పోలీసులు. పాన్ షాప్ వద్ద పక్కకు జరగాలని తరుణ్ కోరడంతో.. ఒకరిపై ఒకరి దాడికి వెళ్లిందని, చివరికి ప్రాణాలు తీసే వరకు పరిస్థితి మారిందని స్థానికులు తెలిపారు.
Read also: Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్ల సమస్యలపై ఆరా!
మరోవైపు మియాపూర్ లో అల్లుడు మామను చంపిన ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. అల్లుడు రవికుమార్ కూతురు అనితల మధ్య తరచు గొడవలు జరిగేవి. గొడవల కారణంగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుండి అనిత వెళ్లిపోయింది. నా కూతురు లేకుండా నువ్వు నా ఇంట్లో ఎలా ఉంటావని అల్లుడితో మామ కిష్టయ్య గొడవ పడ్డాడు. గొడవ పెద్దగా అవ్వడంతో పక్కనే ఉన్న పారతో కిష్టయ్య తలపై బలంగా కొట్టిన అల్లుడు వెంకటేష్. తలపై బలంగా కొట్టడంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. నిందితుడు రవికుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ బ్యారక్ పక్కన ఎవరెవరు గ్యాంగ్ స్టర్లు ఉన్నారంటే ?
తాజావార్తలు
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..