Khammam Thieves: ఖమ్మంలో దొంగలు హల్చల్.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం..
- గ్రామస్తులు వెంబడించటంతో నల్ల బట్టలు విప్పి పారిపోయిన దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Thieves: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కూల్ డ్రింక్ షాప్ లు, ఓ కిరాణా షాప్ లో కొందరు దొంగతనాలకు పాల్పడ్డారు. నల్లబట్టలు ధరించి ఎవరికి అనుమానం రాకుండా దోడిచేశారు. అయితే కిరాణా షాప్ అలజడి రావడంతో కొందరు స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా షాపులో కొందరు ఉండటంతో కేకలు వేశారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. పరుగులు పెడుతున్న దొంగలను స్థానికులు వెంబడించారు. దీంతో దొంగలు వారు ధరించిన నల్లబట్టలను పరుగులు పెడుతూనే నడిరోడ్డుమీదే విప్పి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయారు. దీంతో గ్రామస్తులకు దొంగలను పట్టుకునేందుకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దొంగలు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొంది.
Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ఇక చేసేది ఏమీలేక గ్రామస్థులు వెనుతిరిగారు. అయితే ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే వున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలు నల్లబట్టలు ధరించి దోపిడీలకు పాల్పడుతున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో రాత్రిళ్లు నల్లబట్టలు ధరించి దోపిడి చేయడం వలన ఎవరికి కనిపించకుండా ఉండవచ్చనే ఐడియాతో దొంగతనాలకు పాల్పడుతున్నారని. ఒకవేళ ఎవరైనా వారిని కనిపెట్టిన చీకటిగా వున్న ప్రదేశంలో వుంటే వారిని ఎవరు గుర్తుపట్టరనే ఉద్దేశంతో ఇలా చేసి వుంటారని పోలీసులు తెలిపారు. దొంగలు విడిచి వెల్లిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని .. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!