Khammam Thieves: ఖమ్మంలో దొంగలు హల్చల్.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం..
- గ్రామస్తులు వెంబడించటంతో నల్ల బట్టలు విప్పి పారిపోయిన దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Thieves: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కూల్ డ్రింక్ షాప్ లు, ఓ కిరాణా షాప్ లో కొందరు దొంగతనాలకు పాల్పడ్డారు. నల్లబట్టలు ధరించి ఎవరికి అనుమానం రాకుండా దోడిచేశారు. అయితే కిరాణా షాప్ అలజడి రావడంతో కొందరు స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా షాపులో కొందరు ఉండటంతో కేకలు వేశారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. పరుగులు పెడుతున్న దొంగలను స్థానికులు వెంబడించారు. దీంతో దొంగలు వారు ధరించిన నల్లబట్టలను పరుగులు పెడుతూనే నడిరోడ్డుమీదే విప్పి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయారు. దీంతో గ్రామస్తులకు దొంగలను పట్టుకునేందుకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దొంగలు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొంది.
Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..
Also Read
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇక చేసేది ఏమీలేక గ్రామస్థులు వెనుతిరిగారు. అయితే ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే వున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలు నల్లబట్టలు ధరించి దోపిడీలకు పాల్పడుతున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో రాత్రిళ్లు నల్లబట్టలు ధరించి దోపిడి చేయడం వలన ఎవరికి కనిపించకుండా ఉండవచ్చనే ఐడియాతో దొంగతనాలకు పాల్పడుతున్నారని. ఒకవేళ ఎవరైనా వారిని కనిపెట్టిన చీకటిగా వున్న ప్రదేశంలో వుంటే వారిని ఎవరు గుర్తుపట్టరనే ఉద్దేశంతో ఇలా చేసి వుంటారని పోలీసులు తెలిపారు. దొంగలు విడిచి వెల్లిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని .. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!