Khammam Thieves: ఖమ్మంలో దొంగలు హల్చల్.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం..
- గ్రామస్తులు వెంబడించటంతో నల్ల బట్టలు విప్పి పారిపోయిన దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Thieves: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కూల్ డ్రింక్ షాప్ లు, ఓ కిరాణా షాప్ లో కొందరు దొంగతనాలకు పాల్పడ్డారు. నల్లబట్టలు ధరించి ఎవరికి అనుమానం రాకుండా దోడిచేశారు. అయితే కిరాణా షాప్ అలజడి రావడంతో కొందరు స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా షాపులో కొందరు ఉండటంతో కేకలు వేశారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. పరుగులు పెడుతున్న దొంగలను స్థానికులు వెంబడించారు. దీంతో దొంగలు వారు ధరించిన నల్లబట్టలను పరుగులు పెడుతూనే నడిరోడ్డుమీదే విప్పి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయారు. దీంతో గ్రామస్తులకు దొంగలను పట్టుకునేందుకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దొంగలు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొంది.
Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
ఇక చేసేది ఏమీలేక గ్రామస్థులు వెనుతిరిగారు. అయితే ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే వున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలు నల్లబట్టలు ధరించి దోపిడీలకు పాల్పడుతున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో రాత్రిళ్లు నల్లబట్టలు ధరించి దోపిడి చేయడం వలన ఎవరికి కనిపించకుండా ఉండవచ్చనే ఐడియాతో దొంగతనాలకు పాల్పడుతున్నారని. ఒకవేళ ఎవరైనా వారిని కనిపెట్టిన చీకటిగా వున్న ప్రదేశంలో వుంటే వారిని ఎవరు గుర్తుపట్టరనే ఉద్దేశంతో ఇలా చేసి వుంటారని పోలీసులు తెలిపారు. దొంగలు విడిచి వెల్లిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని .. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!