Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్లో ఎక్కడంటే..
- హైదరాబాద్లోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త ..
- ప్రతిరోజూ హిమాయత్నగర్- జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో లడ్డూ ప్రసాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu: హైదరాబాద్లోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి హైదరాబాద్ నగరంలో కూడా తిరుమల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భాగ్యనగరంలో భక్తులందరికీ లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా వారానికి ఒకసారి మాత్రమే లభించే తిరుపతి లడ్డూను ఇకపై అన్ని రోజులూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని హిమాయత్నగర్ టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని భక్తులకు ఇక నుంచి ప్రతిరోజు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు తెలిపారు. హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది.
Read also: HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు.. జయభేరి కన్స్ట్రక్షన్స్కు నోటీసులు..
Also Read
- CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
- Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
ఈ లడ్డూ ప్రసాదం రూ.50కే అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూల విక్రయాలు జరిగేవి. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇక మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ రుచి, వాసన, నాణ్యత పెరగనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు కర్ణాటక ప్రభుత్వ నందిని నెయ్యి వినియోగాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇటీవల తిరుమలలో భక్తులకు నిత్యం మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా అందజేస్తున్న టీటీడీ తాజాగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి ప్రమాణాలు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Bhatti Vikramarka: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రి 1 గంట వరకు బాధితులతో భట్టి ముఖాముఖి
తాజావార్తలు
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
-
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?