Khammam: రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించిన స్టాఫ్ నర్సు.. పసికందు మృతి
- వైద్యుల నిర్లక్ష్యం పసికందు బలి.
- ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పి హెచ్ సి లో ఘటన..
- రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం గా వ్యవహరించిన స్టాఫ్ నర్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam: ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రలు మాట్లాడుతూ.. మల్లవరం గ్రామానికి చెందిన గర్భిణీ దడిపల్లి లావణ్యను ప్రసవం కోసం నిన్న (శనివారం) ఉదయం 10 గంటలకు తల్లాడు మండలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చామన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లావణ్య కు డెలివరీ పెయిన్స్ రావడంతో భర్త దాడిపళ్లి అశోక్ స్టాప్ నర్స్ కళావతికి చెప్పాడు. అయినా కళావతి తన మాటలు పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహిస్తూ ఆమె సెల్ ఫోన్ లో రిల్స్ చూస్తూ కూర్చుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారుగూడెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు వై.గోపి డెలివరీకై ఆసుపత్రికి వచ్చారు. గోపితో పాటు స్టాఫ్ నర్స్ కళావతి, ఏఎన్ఎం త్రివేణి, ఆశా వర్కర్ ఉమా.. డెలివరీ చేస్తున్న సమయంలో లావణ్యకు పల్స్ రేట్ తగ్గి.. క్రిటికల్ గా మారిందని.. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారు.
Read also: B.Vinod Kumar: కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారు..
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ఇప్పుడు సగం ప్రసవం చేసిన తరువాత.. ఎలా తీసుకుని వెళ్తామని భర్త అశోక్ కాళ్లవేళ్ల పడ్డా పట్టించుకోలేదని వాపోయాడు. కళావతి యోని నుంచి పసికందు తలభాగంలో కొంతమేరకు బయటకు వచ్చిందని కాపాడాలని కోరిన ససేమిరా అన్నారు. అయితే దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. డాక్టర్ గోపి గంట పాటు శ్రమించి బేబీని బయటికి తీశారు. అయితే అప్పటికే బేబీ ఉమ్ము నీరు తాగి చనిపోయుందని బాధితులు ఆరోపిస్తున్నారు. లావణ్య పరిస్థితి క్రిటికట్ గా మారడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించేందుకు 108 కు కాల్ చేశామని వారు కూడా సహకరించాలేదని వాపోయారు. దీంతో గతిలేక లావణ్య బందువులు ప్రైవేట్ వెహికల్ తో ఖమ్మం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ఆమెకు వైద్యం చేయిస్తున్నారు. దీనిపై ఖమ్మంలో జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రభుత్వం ఆసుపత్రిలో ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయని బాధితులు, స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకున్న పోలీలు దర్యాప్తు చేస్తున్నారు.
Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..