Khammam: రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించిన స్టాఫ్ నర్సు.. పసికందు మృతి
- వైద్యుల నిర్లక్ష్యం పసికందు బలి.
- ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పి హెచ్ సి లో ఘటన..
- రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం గా వ్యవహరించిన స్టాఫ్ నర్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam: ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రలు మాట్లాడుతూ.. మల్లవరం గ్రామానికి చెందిన గర్భిణీ దడిపల్లి లావణ్యను ప్రసవం కోసం నిన్న (శనివారం) ఉదయం 10 గంటలకు తల్లాడు మండలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చామన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లావణ్య కు డెలివరీ పెయిన్స్ రావడంతో భర్త దాడిపళ్లి అశోక్ స్టాప్ నర్స్ కళావతికి చెప్పాడు. అయినా కళావతి తన మాటలు పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహిస్తూ ఆమె సెల్ ఫోన్ లో రిల్స్ చూస్తూ కూర్చుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారుగూడెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు వై.గోపి డెలివరీకై ఆసుపత్రికి వచ్చారు. గోపితో పాటు స్టాఫ్ నర్స్ కళావతి, ఏఎన్ఎం త్రివేణి, ఆశా వర్కర్ ఉమా.. డెలివరీ చేస్తున్న సమయంలో లావణ్యకు పల్స్ రేట్ తగ్గి.. క్రిటికల్ గా మారిందని.. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారు.
Read also: B.Vinod Kumar: కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారు..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
ఇప్పుడు సగం ప్రసవం చేసిన తరువాత.. ఎలా తీసుకుని వెళ్తామని భర్త అశోక్ కాళ్లవేళ్ల పడ్డా పట్టించుకోలేదని వాపోయాడు. కళావతి యోని నుంచి పసికందు తలభాగంలో కొంతమేరకు బయటకు వచ్చిందని కాపాడాలని కోరిన ససేమిరా అన్నారు. అయితే దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. డాక్టర్ గోపి గంట పాటు శ్రమించి బేబీని బయటికి తీశారు. అయితే అప్పటికే బేబీ ఉమ్ము నీరు తాగి చనిపోయుందని బాధితులు ఆరోపిస్తున్నారు. లావణ్య పరిస్థితి క్రిటికట్ గా మారడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించేందుకు 108 కు కాల్ చేశామని వారు కూడా సహకరించాలేదని వాపోయారు. దీంతో గతిలేక లావణ్య బందువులు ప్రైవేట్ వెహికల్ తో ఖమ్మం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ఆమెకు వైద్యం చేయిస్తున్నారు. దీనిపై ఖమ్మంలో జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రభుత్వం ఆసుపత్రిలో ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయని బాధితులు, స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకున్న పోలీలు దర్యాప్తు చేస్తున్నారు.
Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?