KCR: కేసీఆర్ ఆలిండియా టూర్ షురూ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గతంలో రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు నష్ట పరిహారం అందించనున్నారు. ఇదే విధంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో చర్చించే అవకాశం ఉంది.
శుక్రవారం ఢిల్లీలో ఆర్థికవేత్తలు, జర్నలిస్టులతోె కేసీఆర్ సమావేశం కానున్నారు. మే 21న చంఢీగడ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. సైనిక కుటుంబాలను, రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. 26న బెంగళూర్ లో మాజీ ప్రధాని దేెవెగౌడతో బెంగుళూర్ లో భేటీ కానున్నారు. మే 29,30 తేదీల్లో బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆ తరువాత మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధిలో ఉద్యమకారుడు అన్నా హజారేను కలవనున్నారు సీఎం కేసీఆర్. అలాగే కేసీఆర్ తన పర్యటనలో 2020లో గాల్వాన్ వ్యాలీ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలను పరామర్శిస్తారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ఇటీవల పలు సందర్భాల్లో కేసీఆర్, ప్రధాని మోదీ, బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి నేతల నుంచి మద్దతు వచ్చింది. ఆ సమయంలో స్వయంగా కేసీఆర్ వెళ్లి సదరు నేతలను కలుస్తానని వెల్లడించారు. దీంట్లో భాగంగానే ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడాలని పలు సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ముంబైలో కలిశారు. త్వరలోనే ఢిల్లీలో ఎన్డీయేతర రాష్ట్రాల సీఎంలతో భేటీ ఉంటుందని కేసీఆర్ ఆ సమయంలో చెప్పారు.
తాజావార్తలు
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..