KA Paul: నాకు ఓటు వేస్తే.. మునుగోడుని అమెరికా చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Promises To Develop Munugode As America: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన.. ఒక చిన్న హోటల్లో దోసెలు వేస్తూ కనిపించారు. ఓవైపు దోసె వేస్తూనే, మరోవైపు అక్కడున్న ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తన పార్టీకి ఉంగరం గుర్తుని కేటాయించారని, తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానని అన్నారు.
కేఏ పాల్ మాట్లాడుతూ.. నిరుద్యోగులందరూ తన కేఏ పాల్ యాప్లో లాగిన్ అవ్వమని, అలాగే ఆ యాప్ని షేర్ చేయమని కోరారు. మునుగోడుని అమెరికా చేసి పారేద్దామని చెప్పారు. మునుగోడులో ఉన్న ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానని.. రెండు సంవత్సరాలలోపు నిరుద్యోగ సమస్యే లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే.. తాను ఏ హోటల్లో అయితే దోసెలు వేస్తున్నానో, ఆ దంపతుల ఇద్దరు పిల్లలకే కేజీ టు పీజీ వరకు చదివిస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు. వందలమంది పిల్లల్ని కూడా తాను చదివిస్తానని మాటిచ్చారు. మండలానికి ఒక్కోటి చొప్పున ఆసుపత్రి, కాలేజీలు నిర్మిస్తానని కూడా హామీ ఇచ్చిన ఆయన.. రైతుల సమస్యల్ని సైతం తీరుస్తానన్నారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఓటు వేయాలని కేఏ పాల్ కోరారు. తన పార్టీ గుర్తు ఉంగరమని, సీరియల్ నం. 17 అని చెప్పిన ఆయన.. ఈ కుల, కుటుంబ అవినీతి పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి, మన మునుగోడుని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇతర రాజకీయ నాయకుల దొంగ మాటలు నమ్మొద్దని కేఏ పాల్ కోరారు. కొసమెరుపు ఏమిటంటే.. కేఏ పాల్ మాటలకు కౌంటర్లు ఇస్తూ, జనం కూడా ఉత్సాహం చూపారు.
తాజావార్తలు
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!