KA Paul: ఒక్క లేఖ రాస్తే చాలు.. సీఎం కేసీఆర్కు లక్ష కోట్లు ఇస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Offer To CM KCR If He Writes A Letter On Peace Meeting: అక్టోబర్ 2వ తేదీన శాంతి సదస్సు నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే.. తాను తెలంగాణ రాష్ట్రానికి రూ. లక్ష కోట్లు ఇస్తానని బంపరాఫర్ ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. యాదగిరిగుట్టకు రూ.2వేల కోట్లు ఇచ్చిన సీఎం.. క్రైస్తవుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి చూపుతున్నారని, ఇంతవరకూ ఏ చర్చికి రూ.2 వేలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అన్ని మతాలను సీఎం కేసీఆర్ సమానంగా చూడడం లేదని విమర్శించారు. తాను సీఎం అయితే మాత్రం అన్ని మతాలను సమానంగా చూసుకుంటానని.. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు నిధులిస్తానని చెప్పారు. క్రైస్తవుల్లో ఐకమత్యం కొరవడిందని, ఇంటికో పార్టీ పెట్టుకొని కూడా ఇతర పార్టీ నాయకుల దగ్గర దేహీ అంటూ వెళ్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో తన పార్టీ రద్దు అయ్యిందని వస్తున్న వార్తలపై కేఏ పాల్ స్పందిస్తూ.. తమ పార్టీ రద్దు కాలేదని, తమ పార్టీకి ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని, దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని అన్నారు. ఈనెల 25న తన 59వ పుట్టినరోజు సందర్భంగా.. మునుగోడులో 59 మందికి డ్రా ద్వారా పాస్పోర్టులు ఇప్పిస్తానని, విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మరో ఏడు వేల మందికి సైతం ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బయట కొట్టుకుంటున్నా.. లోపల మాత్రం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. లోపల కుమ్మక్కై, బయట మాత్రం రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వేల పాటలు పాడిన గద్దర్ శాంతి కోసం పాటు పడ్డారని, ఆయన భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?