K Laxman: కీలక పదవి.. ఆ కమిటీలోనూ చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman Gets Place In BJP Parliamentary Board and Central Election Committee: 2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. బీజేపీ అప్పుడే రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ తరుణంలోనే కేంద్ర పార్లమెంటరీ బోర్డుని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులతో కూడిన ఈ బోర్డులో తెలంగాణ నుంచి కే. లక్ష్మణ్ను చోటు కల్పించారు. ఈ బోర్డుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. కే లక్ష్మణ్ సహా ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, యడ్యూరప్ప, శర్భానంద్ సోనావాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్యనారాయణ జటీయా, బిఎల్ సంతోష్ సభ్యులుగా ఉన్నారు. ఇదే సమయంలో నూతన కేంద్ర ఎన్నికల కమిటీని సైతం బీజేపీ నియమించింది. ఇందులోనూ కే. లక్ష్మణ్కు చోటు కల్పించడం విశేషం. మొత్తం 15 మంది సభ్యులున్న ఈ కమిటీకి జేపీ నడ్డా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, యడ్యూరప్ప, శర్భానంద్ సోనావాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్యనారాయణ జటీయా, బూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫండవిస్, హోం మాధుర్, వనతి శ్రీనివాస్, బిఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు.
రెండు కమిటీల్లోనూ కే. లక్ష్మణ్కు చోటు కల్పించడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి తెలంగాణలోనూ బీజేపీ జెండా పాతేందుకు సాయశక్తులా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే! ఆ వ్యూహాల్లో భాగంగానే కే. లక్ష్మణ్ను రెండు కమిటీల్లోనూ చోటు ఇవ్వడం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేందుకే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని వాళ్లు అంటున్నారు. అంతకుముందే యూపీ నుంచి లక్ష్మణ్కు రాజ్యసభ్య టికెట్ ఇచ్చి, జాతీయ రాజకీయాలకు క్రీయాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కల్పించారు. అలాగే, రాష్ట్రంలో తమ రాజకీయ వ్యూహాలకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఒక రాష్ట్రస్థాయి నేతను జాతీయ స్థాయికి తీసుకెళ్లి, తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టామని ప్రజల విశ్వాసం పెంచడానికి దోహదం చేశారు. బీజేపీని నమ్మినవాళ్లకి కాస్త ఆలస్యంగానైనా, మంచి పదవులు లభిస్తాయని రాజకీయ నాయకులకు నమ్మకం కల్పించింది. రాజకీయాల్లో షార్ట్ కట్స్ ఉండవు, కష్టమే మనకు పదవులు తెచ్చిపెడుతుందని లక్ష్మణ్ ప్రగాఢంగా విశ్వసించారు. ఆయన నమ్మకమే ఈరోజు ఈ కీలక పదవి రావడానికి కారణమైంది.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!