Jelamoni Ravinder Mudiraj: అనుచరులకు దోచిపెడుతున్నాడు.. కిషన్ రెడ్డి పై జిలమని రవీందర్ ఫైర్
Jelamoni Ravinder Mudiraj: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మల్ రెడ్డి రంగారెడ్డి తరఫున, టిడిపి, కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఏర్పడి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే.. అభివృద్ది ఎలా జరుగుతంది అంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, టిటిడిపి రాష్ట్ర కార్యదర్శి జిలమని రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల అవకాశం ఇచ్చారని అన్నారు. నాడు టిడిపి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చిందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ అవే పథకాలపేరుతో వచ్చాయని తెలిపారు. ఇంకా సంక్షేమం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను తన అనుచరులకు దోచి పెట్టారని మండిపడ్డారు. పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇష్ట రాజ్యాంగా వ్యవహరించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్, స్రవంతి చందు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
KTR: మా ఫేక్ డీపీతో దుష్ప్రచారం చేస్తున్నారు.. ప్రత్యర్థులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!