Site icon NTV Telugu

Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

Jeevanreddy

Jeevanreddy

రాజకీయం ఏదైనా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని, తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి అమోఘమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా (వ్యాఖ్యల్లో 23గా పేర్కొన్నప్పటికీ ప్రస్తుత జిల్లాల సంఖ్య 33) మార్చి పాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు.

Huawei Pura X Max: 7.7-అంగుళాల స్క్రీన్, 5,300mAh బ్యాటరీతో.. కొత్త ఫోల్డబుల్ 5G ఫోన్ విడుదల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని తెలియగానే.. అప్పటివరకు ఏమీ పట్టనట్లు ఉండి, ఇప్పుడు అప్పుడే నిద్రలేచినట్టు రేవంత్ రెడ్డి నటిస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాకతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధికి రాజకీయ రంగు పులమకూడదని, ప్రజలకు మేలు చేసే నాయకత్వాన్నే తాను ఎంచుకున్నానని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Kolkata Knight Riders: 7 మ్యాచ్ లలో 1 విజయం.. KKR ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా? రెస్ట్ ఆఫ్ సీజన్ సీనారియోలు

Exit mobile version