Jangam Bhaskar: తుమ్మల అనుచరుడు జంగం భాస్కర్ ఎక్కడ?
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.
పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి తుమ్మల వర్గం మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో తుమ్మల పర్యటనల జోరు పెరగడంతో తుమ్మల వర్గంపై కేసులను పెట్టిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో మూడు కేసులను తుమ్మల వర్గం మీద పెట్టారు. ఈ నెల పదిహేడున తుమ్మల వర్గానికి చెందిన మాజీ కార్పోరేటర్ జంగం భాస్కర్ ను ఖమ్మం రూరల్ పోలీసులు పిలిపించారు. అయితే మాజీ కార్పోరేటర్ భాస్కర్ అదే రోజు మధ్యాహ్నం ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అయితే మాజీ కార్పోరేటర్ జంగం భాస్కర్ కు హాని చేస్తారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ లో అదే రోజు రాత్రి ధర్నా చేశారు తుమ్మల వర్గీయులు.
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
ఈ సందర్బంగా ఆందోళన చేస్తున్న తుమ్మల వర్గీయుల మీద పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించారు. భాస్కర్ భార్య మీద పడ్డారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేసిన తుమ్మల వర్గీయుల మీద పోలీసులు కేసు పెట్టారు. వారిని నిన్న అరెస్టు చేసిన తరువాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికి జంగం భాస్కర్ ఎక్కడ ఉన్నాడో మాత్రం స్పష్టం కావడం లేదు. గత ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు పిలిపించారు. జంగం భాస్కర్ కనిపించకుండా పోయాడని తెలుస్తోంది. జంగం భాస్కర్ ఎటు పోయాడు అన్నదానిపై పోలీసులు కూడా వివరణ ఇవ్వడం లేదు. కాగా జంగం భాస్కర్ మీద ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి, ఎంఎల్ఎ అనుచరుడు బెల్లం వేణులు కేసులు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన అంటుంది. తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అదే విధంగా ఏసీపీ బస్వి రెడ్డి, ఖమ్మం రూరల్ పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ, సీఐలపై పోలీసు ఉన్నతాధికారులకు, హెచ్చార్సీకి ఫిర్యాదు చేసింది.
పాలేరులోని అధికార పార్టీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తుమ్మలనాగేశ్వర రావు మీద కందాల అనుచరుడు బాహాటంగానే విరుచుకుపడ్డారు. ఇకపోతే తుమ్మల వర్గీయుల మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు. తాజాగా కార్పోరేటర్ జంగం భాస్కర్ ఆచూకీని తెలియనివ్వడం లేదని భాస్కర్ భార్య ఆరోపిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు మాత్రం స్పందించడం లేదు. వివరణ ఇవ్వడం లేదు. పోలీసు అధికారులపై తీవ్ర స్థాయిలో జంగం భాస్కర్ భార్య ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?