Jagtial Fraud: అవ్వా అని ఆప్యాయంగా పిలిచి అన్నీ దోచుకుపోయాడు..
- జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం..
- గంగు అనే వృద్ధురాలిని మాటలతో మభ్యపెట్టి నగలతో ఉడాయించిన వ్యక్తి..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Fraud: ఆవ్వా అని పిలిచాడు. అప్యాయంగా ఆమెను పలకరించాడు. నన్ను గుర్తు పట్టావా అని అడిగాడు.. మాటలు కలిపి ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.4 లక్షల రూపాయలు ఉన్నాయని ఫోటో దిగితే.. డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పాడు. ఒంటిపై బంగారం ఉంటే పింఛన్ రాదని చెప్పి ఒట్టి పై ఉన్న బంగారు నగలు తీసి, ఫోటో తీసుకొస్తానని ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘరానా మోసం జగిత్యాల జిల్లాలో జరిగింది..
Read also: Telangana Assembly 2024 LIVE: నేడు 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గంగు(75) అనే వృద్ధురాలు మెడిసిన్ కోసం కోరుట్లకు వచ్చింది. మందులు తీసుకుని ఇంటికి వెళ్ళేందుకు నంది చౌరస్తా వద్ద గల బస్టాఫ్ కు చేరింది. ఒంటరిగా వచ్చిన వృద్ధురాలిని గమనించిన మోసగాడు, ఆ ముసలమ్మతో మాటలు కలిపాడు. అవ్వా బాగున్నావా,నన్ను గుర్తు పడుతున్నావా అని అడిగాడు.నేను మీ ఎమ్మార్వో ను అంటూ పింఛన్ తీసుకున్నావా అని ఆప్యాయంగా మాటలు కలిపాడు. రూ.4 లక్షలు నీ ఖాతాలో జమ అయిందని చెప్పాడు.
Read also: TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల..? నేడు సభలో చర్చ..
ఎవరికి చెప్పకు, నీ ఒక్కదానికి ఆ డబ్బులు ఇప్పిస్తా, ఒక ఫోటో ఇస్తే సరిపోతుందని ముసలమ్మను బస్టాప్ నుంచి కొద్ది దూరంలోని సంధిలోకి తీసుకెళ్లాడు. పొటో తీయాలి, నీ ఒంటిపై బంగారు నగలు ఉంటే ఫొటోలో అవి కనిపిస్తే పింఛన్ రాదని నమ్మబలికాడు. దీంతో నిజమే కావచ్చని భావించిన వృద్దురాలు మెడలోని రెండు తులాల బంగారు చైన్, చెవి కమ్మ తీసి ఇచ్చింది. అతనితో మరో మహిళా కూడా అక్కడే ఉంది. ఆమెకు ఈ నగలు ఇచ్చి ఫోటో తీసుకొద్దాం పదా అని చెప్పి నగలతో ఉడాయించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఎంతకు రాకపోవడంతో తను మోసపోయానని గ్రహించిన గంగు అనే అవ్వ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Manchu Mohan Babu: మంచు మోహన్బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!