IT Raids: మళ్లీ ఐటీ దాడులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లలో సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెల్లవారుజాము 4 నుంచే ఐటీ దాడులు మొదలయ్యాయి. ఐటీ కార్యాలయం నుంచి సిబ్బంది 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు ఒక్కసారిగా భారీ వాహనాలతో బయటకు రావడంతో ఎవరి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతాయో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. పెద్ద సంఖ్యలో ఐటీ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఐటీ శాఖ బడా వ్యక్తులపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఐటీ దాడులు చేస్తుండటంతో హైదరాబాద్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
Read also: Love is Crazy: దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..
Also Read
తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారులు, వ్యాపార సంస్థలలో ఐటీ సోదాలు జరగడం సంచలనం రేపింది. ఈ క్రమంలో మరోసారి ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులుగా ఏకకాలంలో ఐటీ దాడులు జరగడం తెలంగాణలో కలకలం రేపింది. మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేశారు.ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్లో చూపని సుమారు రూ.20 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. అలాగే హైదరాబాద్లోని ప్రముఖ షాపింప్ మాల్స్పై మూడు రోజులుగా ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత గత నెలలో వంశీరామ్ బిల్డర్స్పై ఐటీ దాడుల్లో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడింది.ఇలా హైదరాబాద్ లో వరుస ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో ప్రతినెలా ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!