NTV Telugu Site icon

Telangana: మారనున్న ఇంటర్‌ పరీక్షల తేదీలు

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్షల షెడ్యూల్‌ మారబోతోంది.. జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్‌ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్‌ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప‌రీక్షల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. జేఈఈ షెడ్యూల్‌ మారిన కారణంగా.. ఇంట‌ర్ ప‌రీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు మంత్రి సబిత.. కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను.. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1 మరియు 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీలు మారబోతున్నాయి.

Read Also: AP: మేకపాటి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ..