జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేసింది ఎన్టీఏ… ఏప్రిల్లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ మెయిన్… జూన్కి వాయిదా వేశారు.. జూన్ 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ఇక, మేలో జరగాల్సిన రెండో విడత పరీక్షలు జులై 21వ తేదీ నుండి 30వ తేదీ…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోంది.. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై ఇవాళ లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. జేఈఈ షెడ్యూల్ మారిన కారణంగా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు మంత్రి సబిత.. కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత…