NTV Telugu Site icon

Singareni: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

Singarreni

Singarreni

Singareni: సింగరేణి డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా దాదాపు 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సింగరేణిలో ప్రస్తుతం కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఇప్పటివరకు 35 సంవత్సరాలు. కరోనా, విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్, మెడికల్ బోర్డులో తప్పులు మరియు ఇతర కారణాల వల్ల, చాలా మంది వారసుల వయస్సు 35 సంవత్సరాలు దాటింది. అలాంటి వారు నిరుద్యోగులుగా కాలం గడుపుతుండగా.. కారుణ్య నియామకాల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నిర్ణయం తీసుకున్నారు.

Read also: TG TET 2024 Results: బిగ్‌ అలర్ట్.. నేడు టెట్ ఫలితాలు విడుదల..

కోవిడ్ సమయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ రెండేళ్లపాటు నిలిపివేయబడింది. సింగరేణిలో పనిచేస్తూ మరణిస్తే వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ప్రస్తుతం కారుణ్య నియామక ప్రక్రియ కొనసాగుతోంది. అనారోగ్యం కారణంగా ఉద్యోగానికి అనర్హుడని మెడికల్ బోర్డు నిర్ధారించినా వారసుడికి ఉపాధి కల్పిస్తున్నారు. వయోపరిమితి పెంపుపై ఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య హర్షం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాల్లో కార్మిక వారసుల గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచినట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఇది 9 మార్చి 2018 నుండి అమలులోకి వస్తుంది. దీని కోసం మీరు సంబంధిత ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే, గరిష్ట వయోపరిమితితో ఉద్యోగం పొందలేని వారికి మాత్రమే కొత్త పథకం వర్తిస్తుంది మరియు వన్-టైమ్ సెటిల్మెంట్ చేయబడలేదు.
Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు.. నేటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్..