MLA Laxmareddy: తగ్గని జోరు అదే హుషారు.. లక్ష్మారెడ్డి సమక్షంలో భారీ చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దూసుకెళ్తున్నారు. గడప.. గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రచారంలో లక్ష్మారెడ్డి జోరు తగ్గడం లేదు అదే హుషారుతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఖానాపూర్ గ్రామపరిధిలోని సోమ నాయక్ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో భారీగా చేరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 15మంది సోమ నాయక్ తండా వాసులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాకప్పి ఘనంగా ఆహ్వానించారు లక్ష్మారెడ్డి. కార్యకర్తల హుషారు, నిరంతర చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అంటూ జెండాలన్నీ పక్కనపెట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
ఖానాపూర్ గ్రామ పరిధి సోమ నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు మెంబర్ మంజు నాయక్, తరుణ్, తులసిరామ్, హన్యతో సహా పలువురు 15 మందికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రానున్న 15 రోజులు చాలా కీలకమని ప్రతి కార్యకర్త నాయకుడు గత 9 ఏండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. మరింత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలకు తెలపాలని కోరారు. ఇక రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచర వర్గం 20 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నికల తరువాత మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని.. పని చేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.
IND vs NZ: అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
తాజావార్తలు
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!