NTV Telugu Site icon

BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటన..

Etala Rajender

Etala Rajender

BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటించనుంది. ఈ పర్యటనలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆర్మూర్ ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి, ఎంఎల్ఏ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొననున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో సహా పలువురు మంత్రులు పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రామంతపూర్ లోని బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ లోని మూసీ పరివాక ప్రాంతంలో ఈటలతో ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలో అఫ్జల్ గంజ్, దూల్పేట్ గౌలిగూడ తదితర ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు టి రాజా సింగ్, మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ , మర్రి శశిధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ పర్యటించనున్నారు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు బహదూర్ పుర నియోజకవర్గంలో అసద్ బాబా నగర్, కేశవ స్వామి నగర్ తదితర ప్రాంతాలలో పార్లమెంట్ సభ్యులు,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకె అరుణ, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, నాయకులు రాహుల్ చంద్ర తదితరులు పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి నాగోల్ దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో పార్లమెంటు సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, శాసనసభ్యులు డా.హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి పర్యటిస్తారు. రాజేంద్ర నగర్ గంధం గూడ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ బృందం పర్యటించనుంది.
Diwali Special Trains: దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల కోసం UTS మొబైల్ యాప్..