టెక్నాలజీ మనుషులకు సుఖాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా కొందరు టెక్నాలజీని ఉపయోగించి దారుణాలకు పాల్పడుతున్నారు. మొబైళ్ల ద్వారా వీడియో షూట్లు చేసి బెదిరింపులకు పాల్పడటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది. జూబ్లీహిల్స్లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకుంది.
Read Also: వీళ్లు మనుషులేనా? బాలికపై అత్యాచారం చేసిన తండ్రీకొడుకులు
ట్రయల్ రూమ్లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు షోరూంకు చేరుకుని స్టోర్ మేనేజర్, ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఫోటోలు తీసిన సెల్ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ ఘటనపై సీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలను మీడియాకు వెల్లడించారు. యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ను అరెస్ట్ చేశామని, హెచ్అండ్ఎం షోరూంపైనా కేసు పెట్టినట్లు ఆయన తెలిపారు. లేడీస్ ట్రయల్ రూంలో సెల్ఫోన్ సహాయంతో పైనుంచి యువకులు వీడియో తీశారని, దీంతో సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని డేటా మొత్తం చెక్ చేస్తున్నట్లు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.