NTV Telugu Site icon

TGSRTC MD Sajjanar: స్కూల్, కాలేజీ అమ్మాయిలే వాళ్ల టార్గెట్.. సజ్జనార్‌ ట్వీట్‌ వైరల్‌

V C Sajjanar

V C Sajjanar

TGSRTC MD Sajjanar: నగరంలో కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బులు సంపాదించాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. ఇక వీరి అత్యాశకు అమాయకపు ప్రజలు నిలువున మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ల జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తూ లక్షల రూపాయాలు కొల్లగొడుతున్నారు. తాజాగా నగరంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి సైబర్ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే అంటూ టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read also: MMTS: ప్రజలకు ఎంఎంటీఎస్‌ గుడ్‌ న్యూస్‌.. 17, 18 తేదీల్లో రాత్రి కూడ ప్రత్యేక రైళ్లు

సజ్జనార్ ట్వీట్ లో ఏముందంటే..

ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్ర‌త్త‌!! అంటూ ట్వీట్ చేశారు. స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారు. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప‌ర్లు చంపేస్తారంటూ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారని తెలిపారు. తాజాగా #Hyderabad రాయ‌దుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబ‌ర్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ”నేను పోలీస్ ఆఫీస‌ర్ ను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌న‌కు గురైంది. ఆమె ప్ర‌స్తుతం మాద‌గ్గ‌రే ఉందని అంటారు. ఆ వెంట‌నే మేం అడిగినంత డ‌బ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించండి. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాప‌ర్లు చంపేస్తారు.” అని బెదిరించారు. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్‌ని వినిపించారు. ఏడుస్తున్న గొంతు వినిపించ‌డంతో కాలేజీకి వెళ్లిన త‌మ‌ కూతురు కిడ్నాప్‌న‌కు గురైంద‌ని త‌ల్లిదండ్రులు భావించారు.

Read also: BRS Meeting: నేడు గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం.. భేటీపై ఉత్కంఠ..

డ‌బ్బులు పంపించేందుకు సిద్ద‌ప‌డ్డారు. మోస‌గాళ్ల‌తో ఫోన్‌లో మాట్లాడుతూనే త‌మ బంధువుల‌కు ఈ విష‌యాన్ని చేర‌వేశారు. త‌మ కూతురు కాలేజీలో ఉందో.. లేదో తెలుసుకోండ‌ని వారిని పంపించారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉంద‌ని చెప్ప‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం నా దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకువ‌చ్చారు. ఈ త‌ర‌హా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఆడ పిల్ల‌లను కిడ్నాప్ చేశార‌ని చెప్ప‌గానే న‌మ్మి వారికి డ‌బ్బులు పంపిస్తున్నారు. అజ్ఞాత వ్య‌క్తుల నుంచి విదేశీ ఫోన్ నంబ‌ర్ల‌తో వ‌చ్చే వాట్సాప్ కాల్స్‌కు స్పందించ‌కండి. బెదిరింపుల‌కు జంక‌కుండా స్థానిక పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేయండి.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?