Group1 Prelims Results: గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ..
- తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది..
- అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group1 Prelims Results: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష విద్యార్థులకు హెచ్చరిక. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రిలిమినరీ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది. అనంతరం ఫలితాలను వెల్లడించారు. అయితే.. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. కాగా..రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 13న ప్రాథమిక కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Read also: Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
కాగా, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిని ఎంచుకోవాలని నిరుద్యోగులు గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో ఈ నెల 5న కూడా టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే 1:50 నిష్పత్తి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ అభ్యర్థనను నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇదే జరిగితే ఉద్యమాలు ఉధృతం చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్లు తెలుస్తోంది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని ప్రజాప్రతినిధులు ఉద్ఘాటిస్తున్నారు.
Read also: Ration Cards: రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పత్తి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జియో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందరికీ న్యాయం జరిగేలా గతంలో మాదిరిగానే జీవో 55ని అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టులను పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!