Group1 Prelims Results: గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ..
- తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది..
- అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group1 Prelims Results: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష విద్యార్థులకు హెచ్చరిక. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రిలిమినరీ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది. అనంతరం ఫలితాలను వెల్లడించారు. అయితే.. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. కాగా..రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 13న ప్రాథమిక కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Read also: Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
కాగా, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిని ఎంచుకోవాలని నిరుద్యోగులు గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో ఈ నెల 5న కూడా టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే 1:50 నిష్పత్తి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ అభ్యర్థనను నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇదే జరిగితే ఉద్యమాలు ఉధృతం చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్లు తెలుస్తోంది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని ప్రజాప్రతినిధులు ఉద్ఘాటిస్తున్నారు.
Read also: Ration Cards: రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పత్తి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జియో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందరికీ న్యాయం జరిగేలా గతంలో మాదిరిగానే జీవో 55ని అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టులను పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!