Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Traffic Challans: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరేలా రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై చలాన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకోడానికి వాహనదారులు తమ వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని స్పష్టం చేసింది. రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. వాహనదారులు ఈ గడువులోగా తమ వివరాలను vahan.parivahan.gov.in వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాఫిక్ చలాన్లు, ఇతర రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు మరియు ఈ-మెయిల్ ద్వారా నేరుగా వాహన యజమానులకు పంపించనున్నారు. దీంతో చలాన్ల విషయంలో పారదర్శకత పెరగడమే కాకుండా, పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత వాహన్ పోర్టల్లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపిన సమాచారం సంబంధిత వాహన యజమానికి చేరినట్లుగానే ప్రభుత్వం పరిగణించనుంది. ఈ నేపథ్యంలో “మాకు చలాన్ సమాచారం రాలేదు”, “మెసేజ్ అందలేదు”, “విషయం తెలియదు” వంటి కారణాలను ఇకపై అధికారులు అంగీకరించబోరని స్పష్టం చేశారు.
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
వాహనదారులు తమ వివరాలను సకాలంలో నవీకరించుకోవడం ద్వారా చలాన్ల సమాచారం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చెల్లింపులను కూడా సకాలంలో పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. అందువల్ల అన్ని వాహన యజమానులు నిర్దేశిత గడువులోగా వాహన్ పోర్టల్లో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ సూచించింది. ఈ కొత్త విధానం ద్వారా చలాన్ల వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. దీంతో భవిష్యత్తులో చలాన్లకు సంబంధించిన వివాదాలు, అపోహలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!