NTV Telugu Site icon

TG High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్..

Tg High Court

Tg High Court

TG High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని హైకోర్టు కోరింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, బీఆర్‌ఎస్ బీ-ఫారంపై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు ముగించింది.

Read also: Heavy Rains: భారీ వర్షాలు.. విలీన మండలాలు అతలాకుతలం..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ కార్యాలయంలో పిటీషన్ ఇచ్చినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి..