Site icon NTV Telugu

Telangana CM: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి.. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే

Revanth Reddy

Revanth Reddy

Telangana CM: మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.. కార్మికులు సమ్మె ఆలోచన వీడండి అని కోరారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది అన్నారు. గత పదేళ్లలో విధ్వంసం జరిగింది.. రాష్ట్రంలో ఆర్ధిక దోపిడీ కొనసాగిందన్నారు. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి.. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి.. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి అన్నారు. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు.. మీ కోసమే ఖర్చు చేస్తాం.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు.. అందుకే ఒకసారి ఆలోచించండి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Kishan Reddy: ప్రధాని మోడీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది..

ఇక, కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది.. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు అని సూచించారు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటాను అని చెప్పుకొచ్చారు.

Exit mobile version