NTV Telugu Site icon

Rachakonda Police: అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠా అరెస్ట్..

Rachakonda

Rachakonda

Rachakonda Police: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని ఈ ముఠా సభ్యులు డబ్బులు దండుకున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మోసాలకు వీళ్లు పాల్పడుతున్నారు అని తెలిపారు పోలీసులు.. ఈలాంటి వారిని నమ్మొద్దని రాచకొండ పోలీసులు తెలిపారు.

Read Also: People Media Factory: “సాలా” సినిమాకు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో

కాగా, ఇప్పటి వరకు ఈ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను రాచకొండ మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నిందితుల్ని మీడియా ముందు రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు ప్రవేశ పెట్టినున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతైన విచారణ చేస్తున్నారు.