President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి
- లోక్ మంథన్ మహోత్సవానికి భాగ్యనగరం వేదికయ్యింది..
- నేడు లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు
- లోక్మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షణ..
President Droupadi Murmu: లోక్ మంథన్ మహోత్సవానికి భాగ్యనగరం వేదికయ్యింది. నేడు లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9.30కి శిల్పకళా వేదికలో లోక్మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు. లోక్మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. నిన్న లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు శిల్పారామంలో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read also: Maoist Attack: వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..
Also Read
- TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లోక్మంథన్ నిర్వహించారు. ఒక్కో రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇది నాల్గవ లోకమంతన్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. దేశంలోని జానపద కళాకారులందరినీ ఒక చోట చేర్చి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రజ్ఞా ప్రవాహ అనే సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతినిధులు, విదేశీ కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. లోక్ మంథన్ వేడుకలో గిరిజన హస్తకళల, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వివిధ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలు తమ నైపుణ్యాలను ప్రదర్శించే కార్యక్రమం కూడా ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 1500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, ఉపకరణాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.
Read also: Tollywood Movies : క్రిస్మస్ జాతర.. ముగ్గురిలో విజేత ఎవరవుతారు ?
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. రాజ్ భవన్ కుడివైపు వీవీ విగ్రహం, కేసీపీ అన్సారీ మంజిల్- తాజ్కృష్ణ, ఎన్ఎఫ్సీఈఎల్ ఎస్ఎల్టీ, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నెం-45 జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం-65, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ- ఎన్ఎఫ్సీఎస్, పంజాగుట్ట వంతెన, ప్రజా భవన్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడిచారు.
VishwakSen : మెకానిక్ రాకీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..?
తాజావార్తలు
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
-
IPL CheerLeaders Salary: గ్లామర్తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!