Site icon NTV Telugu

Shocking Incident: దారుణం.. చిన్నారిని థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన కన్న తల్లి

Untitled Design (7)

Untitled Design (7)

మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో దారుణం చోటుచేసుకుంది. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో ఓ తల్లి.. కన్నకూతురినే మూడంతస్థుల బిల్డింగ్ పై నుంచి పడేసింది. ఈ ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

పూర్తివివరాల్లోకి వెళితే.. మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన పాపను దేవుడు మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో మోనాలిసా అనే మహిళ తన కడుపులో పుట్టిన పాపను బిల్డింగ్ పై నుంచి పడేసింది. మూడో అంతస్థు నుంచి పడేయంతో ఏడేళ్ల చిన్నారి షారోనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. తల్లి అలా ఎందుకు చేసిందో ఎవరికి అర్థం కావడం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం తల్లిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.

Exit mobile version