Begum Bazar Land: బేగంబజార్లో భూమి ధర ముంబయితో పోటీ.. గజానికి రూ.10 లక్షలు..!
- హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్..
- బేగంబజార్లో గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Begum Bazar Land: హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్. హైదరాబాద్లోని ప్రసిద్ది చెందిన బేగంబజార్లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు బేగంబజార్ లో భూముల ధర ముంబైతో పోటీ పడుతోంది. ముంబైలో మాదిరిగా ఇక్కడ కూడా గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. వీధిని బట్టి గజం ధర కనీసం రూ.20 లక్షలు మరియు ప్రైమ్ ఏరియాల్లో రూ.25 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర రూ.70 నుంచి రూ.80 వేలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు ధర రూ.20 వేలకు మించడం లేదు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ధరలు పెరగడం విశేషం.
Read also: CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
భవిష్యత్తులో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బేగంబజార్లో ఖాళీ లేదు. పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలు వాటి యజమానులకు బంగారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించినా ఇప్పుడు పాత భవనాలకు గిరాకీ పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి బేగంబజార్ వైపు మళ్లింది. పాత భవనాల విక్రయాలపై నిత్యం ఆరా తీస్తున్నారు. అందరికంటే ఎక్కువ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు రేటు పెంచడంతో వ్యాపారుల మధ్య పోటీ వేలంపాటను తలపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలు కొత్త నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర నుండి చాలా మంది టోకు వ్యాపారులు ఇక్కడ స్థిరపడ్డారు. చదరపు అడుగుకు విక్రయించే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలో పలుకుతున్నాయి.
Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
తాజావార్తలు
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!