KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం..
- మంత్రి కొండా సురేఖపై కేసు..
- నేడు కేటీఆర్ వాంగ్మూలం..
- నిన్న (మంగళవారం) ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Testimony: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (బుధవారం)ప్రజా ప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో.. ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. గత విచారణ సందర్భంగా కేటీఆర్ సమయం కోరారు. దీంతో నాంపల్లి స్పెషల్ కోర్ట్ ఈరోజు (బుధవారం)కు వాయిదా వేశారు. ఈరోజు కోర్టుకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వనున్న కేటీఆర్. మేజిస్ట్రేట్ శ్రీదేవి ఆదేశాల మేరకు.. ఫిర్యాదుదారులైన కేటీఆర్తో పాటు సాక్షులుగా వున్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్కుమార్ వాంగ్మూలాలను కూడా కోర్టులో నమోదు చేయనున్నారు. తనపై దాఖలైన ఆరోపణలపై కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేందుకు మంత్రి కొండా సురేఖకు అవకాశం కల్పిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు బుధవారం కోర్టుకు హాజరుకావాలని లంగర్హౌస్ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. మరోవైపు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
Read also: Group-1 Exam Day 3: తెలంగాణలో మూడో రోజు గ్రూప్-1 పరీక్ష..
Also Read
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
నిరాధార ఆరోపణలను వీడే ప్రసక్తే లేదని కొండా సురేఖపై పరువునష్టం దావా అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తన వ్యక్తిత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిని పిరికిపందలను వదలబోరని కేటీఆర్ అన్నారు. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన స్టాంగ్ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. మీడియాలో, సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన ప్రచారాన్ని మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా చాలా కాలంగా ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇతరులపై ఎప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు లేదా నీచమైన వ్యాఖ్యలు చేయవద్దు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని కేటీఆర్ ట్వీట్ వేదికగా హెచ్చరించారు. రాజకీయ విమర్శల పేరుతో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా గుణపాఠం కావాలి. కోర్టుల్లో నిజం గెలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.
South Korea Tour: సియోల్ లో AI సిటీని సందర్శించనున్న తెలంగాణ అధికార బృందం..
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..