NTV Telugu Site icon

KTR: అప్పుడు కామెంట్లు.. ఇప్పుడు కుట్రలు.. కడియం పై కేటీఆర్ ఫైర్

Ktr Kadiam Srihari

Ktr Kadiam Srihari

KTR: మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ కు పిటిషన్ సమర్పించామన్నారు. గతలో దానం పై పిటిషన్లు ఇచ్చాము.. తర్వాత స్పీడ్ పోస్ట్ లు ఇచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ మొత్తం10 మంది పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపుల పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని తెలిపారు. గడ్డం ప్రసాద్ కు జడ్జిమెంట్ కాపీ చదివి వినిపించానని అన్నారు.

Read also: మగవాళ్ళు చెవులు కుట్టించుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఆ..!

సుప్రీంకోర్టు కలగచేసుకుని ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశామని తెలిపారు. ఫిరాయింపుల అంశాల్లో సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. స్పీకర్ వద్ద న్యాయం జరగపోతే సుప్రీంకోర్టు కు వెళ్తామని తెలిపారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లఘన కు కాంగ్రెస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారు పొలిటికల్ సూసైడ్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం అన్నా కడియం కోవర్ట్ అనే అనుమానం వస్తుందన్నారు. మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారు అని అన్నారు.
పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా? ఇది మీ కోసమే..