B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- కీర్తి(21) ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది
- డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- కీర్తి సోదరుడు నాగరాజు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందిపోయి సమస్యల వలయంలో చిక్కుకుని పరిష్కారం కోసం ప్రయత్నించకుండా తనువు చాలిస్తున్నారు. ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్థిని డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
ఏం కష్టమొచ్చిందో ఏమో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో డీజిల్ పోసుకుని నిప్పింటించుకుని అగ్నికి ఆహుతైపోయింది. ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన ఓ కుటుంబం బడంగ్పేట మారుతీనగర్లో నివాసం ఉంటోంది. కీర్తి(21) గండిపేట లోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు తల్లి, సోదరి, అన్న ఉన్నారు. శనివారం కళాశాలకు వెళ్లిన కీర్తి.. మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.
Also Read
సాయంత్రం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా.. కీర్తి డీజిల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంటలు వ్యాపించి కేకలు, పొగ రావడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకునేసరికి కీర్తి మంటల్లో కాలిపోయి మృతిచెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కీర్తి సోదరుడు నాగరాజు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
తాజావార్తలు
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!