Kaleshwaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ..
- కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం..
- 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్..
- విచారణలో భాగంగా కమిషన్ ఎదుట హాజరుకానున్న డీఈలు, ఏఈలు..
- ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. నేడు (సోమవారం) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. రేపు (మంగళవారం) మరో 14 మంది ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇప్పటికే కమిషన్కు చేరాయి. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారుల తర్వాత ప్రశ్నిస్తారు. వారి తరువాత, కాంట్రాక్టర్లను పిలిచి అనేక ప్రశ్నలు అడుగుతారు. కాళేశ్వరం కమిషన్ అకౌంట్స్ విభాగం అధికారులను కూడా ప్రశ్నించనుంది. ప్రాజెక్టు నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు పలు ప్రశ్నలు వేయనున్నారు.
Read also: Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులను కూడా బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ మంత్రులను కూడా విచారించే యోచనలో కమిషన్ చైర్మన్ ఘోష్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన కీలక అంశాలను ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారితో పాటు ఆయా నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ ప్రజాప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ తుది దశకు చేరుకుంది. అందరినీ విచారించిన అనంతరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
తాజావార్తలు
-
Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్లో సిరాజ్ భాయ్.!
-
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
-
Neel – Mahesh : ఊహించని కాంబో.. నిజమైతే మాత్రం..?
-
Tollywood : ఎగ్జిబిటర్స్ vs గిల్డ్ నిర్మాతల వివాదం.. నేడు పవర్ స్టార్ తో గిల్డ్ నిర్మాతలు కీలక సమావేశం
-
Trump-Pakistan: పాకిస్థాన్కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!