Kaleshwaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ..
- కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం..
- 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్..
- విచారణలో భాగంగా కమిషన్ ఎదుట హాజరుకానున్న డీఈలు, ఏఈలు..
- ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది..
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. నేడు (సోమవారం) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. రేపు (మంగళవారం) మరో 14 మంది ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇప్పటికే కమిషన్కు చేరాయి. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారుల తర్వాత ప్రశ్నిస్తారు. వారి తరువాత, కాంట్రాక్టర్లను పిలిచి అనేక ప్రశ్నలు అడుగుతారు. కాళేశ్వరం కమిషన్ అకౌంట్స్ విభాగం అధికారులను కూడా ప్రశ్నించనుంది. ప్రాజెక్టు నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు పలు ప్రశ్నలు వేయనున్నారు.
Read also: Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులను కూడా బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ మంత్రులను కూడా విచారించే యోచనలో కమిషన్ చైర్మన్ ఘోష్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన కీలక అంశాలను ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారితో పాటు ఆయా నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ ప్రజాప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ తుది దశకు చేరుకుంది. అందరినీ విచారించిన అనంతరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!