Kaleshwaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ..
- కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం..
- 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్..
- విచారణలో భాగంగా కమిషన్ ఎదుట హాజరుకానున్న డీఈలు, ఏఈలు..
- ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. నేడు (సోమవారం) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. రేపు (మంగళవారం) మరో 14 మంది ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇప్పటికే కమిషన్కు చేరాయి. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారుల తర్వాత ప్రశ్నిస్తారు. వారి తరువాత, కాంట్రాక్టర్లను పిలిచి అనేక ప్రశ్నలు అడుగుతారు. కాళేశ్వరం కమిషన్ అకౌంట్స్ విభాగం అధికారులను కూడా ప్రశ్నించనుంది. ప్రాజెక్టు నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు పలు ప్రశ్నలు వేయనున్నారు.
Read also: Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Also Read
పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులను కూడా బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ మంత్రులను కూడా విచారించే యోచనలో కమిషన్ చైర్మన్ ఘోష్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన కీలక అంశాలను ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారితో పాటు ఆయా నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ ప్రజాప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ తుది దశకు చేరుకుంది. అందరినీ విచారించిన అనంతరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
తాజావార్తలు
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!