Azharuddin: హెచ్సీఏ నిధుల కేసు.. అజారుద్దీన్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Azharuddin: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ స్థానాన్ని కేటాయించింది. ఇప్పటికే కోర్టు నుంచి బి ఫారం అందుకున్నాడు. తదుపరి దశ నామినేషన్లు వేయడం. అయితే నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఆయనకు పెద్ద సమస్యే ఎదురైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో అతనిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. అవి నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అజారుద్దీన్ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అజహర్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు బెయిల్పై తీర్పు వెలువడనుంది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ రాకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే ఆయన నామినేషన్కు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసుల కారణంగా ఎన్నికల్లో పోటీ చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో బెయిల్ తీర్పు కోసం అజారుద్దీన్ ఎదురు చూస్తున్నారు. బెయిల్ లభించడంతో అజారుద్దీన్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. హెచ్సీఏలో కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అజారుద్దీన్పై కేసు నమోదైంది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ ఆయనపై 4 కేసులు నమోదు చేసింది.
Also Read
- Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
- CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
- MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
- Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
2020 నుంచి 2023 వరకు హెచ్సీఏలో కోట్లాది రూపాయల నిధులు అవినీతికి పాల్పడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. క్రికెట్ బంతుల కొనుగోలులో భారీ మోసం జరిగినట్లు తేలింది. ఒక్కో బంతికి రూ.392కి బదులు రూ.1400 వర్క్ ఆర్డర్ ఉన్నట్లు గుర్తించింది. కేవలం క్రికెట్ బంతుల కొనుగోలు పేరుతోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు 57 లక్షల నష్టం వాటిల్లిందని కమిటీ ఆడిట్లో తేలింది. బకెట్ కుర్చీలు, అగ్నిమాపక పరికరాలు, జిమ్ పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆడిట్ నివేదిక పేర్కొంది. దీంతో ఉప్పల్ పోలీసులు అజారుద్దీన్పై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై వాదనలు ముగియగా, నేడు తీర్పు వెలువడనుంది.
తాజావార్తలు
-
Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
-
CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
-
MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
-
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!