AV Ranganath: బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
- స్థానిక ప్రజల్లో కుల్చివేతలు ఉంటాయనే అపోహ ఉంది..
- ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చాను- హైడ్రా కమిషనర్ రంగనాథ్..
- రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తాం..
- బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath: హైడ్రా పేరువింటే చాలు.. తెలంగాణలోని స్థానిక ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఎప్పుడు హైడ్రా అధికారులు వస్తారో.. వారు ఉంటున్న నివాసాలను కూల్చేస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. స్థానికులకు క్లారిటీ ఇచ్చేందుకు ఇవాళ అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటకు వెళ్లారు. రంగనాథ్ ను చూసిన స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. దీంతో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల్లో కుల్చివేతలు ఉంటాయనే అపోహ ఉంది.. ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవన్నారు. బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామన్నారు. ప్రస్తుతమున్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రా నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, హైడ్రా నోటీసులు ఆక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయన్నారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను ఈరోజు కూల్చేశామన్నారు. ఐదు కాలనీలకు వెళ్ళే రొడ్డును ఆక్రమించారని క్లారిటీ ఇచ్చారు. మాకు స్థానికులు కంప్లెయింట్ చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలు తొలగించామని ఏవీ రంగానాథ్ పేర్కొన్నారు.
Read also: Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అంబర్ పేట్ బతుకమ్మ కుంట వద్దకు రావడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ ఇళ్ళను తొలగిస్తారేమో అని స్థానికులు ఆందోళన చెందారు. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరించడంతో ఇక తమ ఇళ్లు తప్పకుండా కూల్చేస్తారని భయాందోళన చెందారు. స్థానికులు ఆందోళన చూసిన రంగనాత్ వారితో మాట్లాడుతూ.. కూల్చివేతలు చేపట్టడానికి రాలేదని స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బతుకమ్మ కుంటలో మొలిచిన చెట్లను JCB తో తొలగిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్థానికులు అందరూ రంగనాథ్ మాటలకు చప్పట్లు కొట్టారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని హామీ ఇచ్చిచారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైడ్రా కమిషనర్ హామీతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!