హైదరాబాద్లోని KPHB Colony పరిధిలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయాన్ని దాటి పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు చేపట్టారు. పోలీసుల తనిఖీల సమయంలో పబ్లో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. నిర్ణీత సమయానికి మించి పబ్ను నిర్వహిస్తున్నందుకు పబ్ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో చాటింగ్ చేయించడం, పబ్లో డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి న్యూసెన్స్కు కారణమవుతున్నారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడుల సందర్భంగా మొత్తం 9 మంది యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో పబ్ సిబ్బంది, కస్టమర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ ఆపరేషన్ను స్వయంగా కూకట్పల్లి డీసీపీ Rithiraj పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. పబ్లో జరుగుతున్న కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన KPHB Police Station పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

