Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు.. కారణం ఇదే..
- హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పై కేసు నమోదు..
- బతుకమ్మ కార్యక్రమంలో డీజే వాడిందుకు కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు..
- మేయర్ పై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ నెల 10న బంజారాహిల్స్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సమయం మించిపోయినా డీజే వినియోగించడంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శబ్ధ కాలుష్యం చేస్తూ డీజే పెట్టినందుకు, బతుకమ్మ వేడుకల నిర్వాహకులు, డిజే నిర్వాహకులతోపాటు మేయర్పై చర్యలకు సిద్దమయ్యారు. బతుకమ్మ వేడుకల్లో అనుమతించిన దానికంటే ఎక్కువ డెసిబుల్ స్థాయిలో సంగీతాన్ని వినిపించారని పలు ఆరోపణలు రావడంతో మేయర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Read also: TGPSC Group-1 2024: అలర్ట్.. నేటి నుంచి వెబ్సైట్ లో గ్రూప్-1 హాల్టికెట్లు..
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
ఆరోజు జరిగింది ఇదీ..
అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్ బీనగర్ లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అయితే రాత్రి 11.45 గంటల తర్వాత కూడా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని డీజే సౌండ్స్ వినిపించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు అడుగుతున్న బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారని మేయర్ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ప్రోగ్రాం మేనేజర్ విజయ్ కుమార్, డీజే సౌండ్స్ మేనేజర్ గౌస్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, బాణసంచా వినియోగంపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక నుంచి ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, బాణసంచా కాల్చడంపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిషేధం విధించారు. డీజే వాడకం వల్ల తీవ్ర శబ్ధ కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.
Iran Iraq War: ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడి.. నలుగురు సైనికులు మృతి, 60 మందికి పైగా గాయాలు
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!