Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో పలు విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన!
- శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
- శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం..
- రాత్రి నుంచి 200 మంది ప్రయాణికుల పడిగాపులు, తీవ్ర ఇబ్బందులు..
- విమానం ఎప్పుడు వెళ్తుందో చెప్పని ఎయిర్లైన్స్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం నుంచి విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు, క్రూ ఆలస్యాలు, ఇతర నిర్వాహక సమస్యల కారణంగా అనేక ఫ్లైట్లు సమయానికి రాకపోకలు కొనసాగించడం లేదు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏటీసీ సమస్యతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులపై దీని ప్రభావం పడింది.
Read Also: JK Encounter: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Also Read
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
రద్దైన విమానాలు
* ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు పూర్తిగా రద్దు..
* ఇండిగో 6E051 హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం రద్దు..
* ఇండిగో 6E245 హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు..
* ఇండిగో 6E51 హైదరాబాద్ నుండి శివమొగ్గ వెళ్లాల్సిన విమానం కూడా రద్దు..
సాంకేతిక లోపాలతో ఆలస్యం
కొన్ని విమానాలు సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమవుతున్నాయి. ఎయిర్ ఏషియా 68 – హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పాటు వియత్నాం ఎయిర్లైన్స్ వన్984 – సాంకేతిక లోపంతో ఆలస్యమవుతోంది. అలాగే, ఇండిగో 6E37 – శివమొగ్గ వెళ్లాల్సిన ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.
ప్రయాణికుల ఆగ్రహం..
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో 6I532 విమానం, క్రూ సభ్యులు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు చాలా సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిర్లైన్ అధికారులను ప్రశ్నిస్తూ కొందరు గొడవకు దిగారు. తమ విలువైన సమయం పూర్తిగా నష్టపోయామని పేర్కొన్నారు. విమానాలు ఆలస్యమైనా, రద్దయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!