Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో పలు విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన!
- శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
- శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం..
- రాత్రి నుంచి 200 మంది ప్రయాణికుల పడిగాపులు, తీవ్ర ఇబ్బందులు..
- విమానం ఎప్పుడు వెళ్తుందో చెప్పని ఎయిర్లైన్స్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం నుంచి విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు, క్రూ ఆలస్యాలు, ఇతర నిర్వాహక సమస్యల కారణంగా అనేక ఫ్లైట్లు సమయానికి రాకపోకలు కొనసాగించడం లేదు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏటీసీ సమస్యతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులపై దీని ప్రభావం పడింది.
Read Also: JK Encounter: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
రద్దైన విమానాలు
* ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు పూర్తిగా రద్దు..
* ఇండిగో 6E051 హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం రద్దు..
* ఇండిగో 6E245 హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు..
* ఇండిగో 6E51 హైదరాబాద్ నుండి శివమొగ్గ వెళ్లాల్సిన విమానం కూడా రద్దు..
సాంకేతిక లోపాలతో ఆలస్యం
కొన్ని విమానాలు సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమవుతున్నాయి. ఎయిర్ ఏషియా 68 – హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పాటు వియత్నాం ఎయిర్లైన్స్ వన్984 – సాంకేతిక లోపంతో ఆలస్యమవుతోంది. అలాగే, ఇండిగో 6E37 – శివమొగ్గ వెళ్లాల్సిన ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.
ప్రయాణికుల ఆగ్రహం..
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో 6I532 విమానం, క్రూ సభ్యులు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు చాలా సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిర్లైన్ అధికారులను ప్రశ్నిస్తూ కొందరు గొడవకు దిగారు. తమ విలువైన సమయం పూర్తిగా నష్టపోయామని పేర్కొన్నారు. విమానాలు ఆలస్యమైనా, రద్దయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!